దేశంలో అత్యంత విలువైన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ నేడు తన 44న వార్షిక సర్వసభ్య సమావేశాన్ని (ఏజీఎం) నిర్వహించనుంది. వర్చవల్గా జరిగే ఈ సమావేశం మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభం కానుందని సంస్థ ఇదివరకే ప్రకటించింది. కరోనా నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించాలని నిర్ణయించింది. గతేడాది కూడా ఇదే తరహాలో రిలయన్స్.. ఏజీఎంను వర్చువల్గా నిర్వహించింది.
ఏజీఎంకు ప్రత్యేకత..
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏజీఎం అంటే వాటాదారులతో పాటు సాధారణ ప్రజలకు కూడా భారీ అంచనాలు ఉంటాయి. రిలయన్స్ జియో వంటి సంచలన నిర్ణయాన్ని ఏజీఎంలోనే ప్రకటించింది కంపెనీ. ఆర్ఐఎల్.. గత ఏడాది నిర్వహించిన ఏజీఎంను దాదాపు 3 లక్షల మంది వీక్షించారు. ఆ సమావేశం సందర్భంగా జియోలో గూగుల్ పెట్టుబడులు, గ్లాస్ పేరిట సరికొత్త సాంకేతికత అభివృద్ధిపై కీలక విషయాలను ఆ సంస్థ అధిపతి ముకేశ్ అంబానీ వెల్లడించారు.