తెలంగాణ

telangana

By

Published : Nov 3, 2019, 4:40 PM IST

ETV Bharat / business

స్టాక్ మార్కెట్లు ఈ వారం కొత్త శిఖరాలకు చేరేనా?

ఈ వారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాల్లో దిగ్గజ కార్పొరేట్ల ఫలితాలు, అక్టోబర్​కు సంబంధించిన స్థూల ఆర్థిక గణాంకాలు ఉన్నాయి. వీటితో పాటు పలు దేశీయ, అంతర్జాతీయ కారణాలు మదుపరుల సెంటిమెంట్​పై ప్రభావం చూపొచ్చని నిపుణులు చెబుతున్నారు.

స్టాక్​ మార్కెట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసిక ఫలితాలు.. స్థూల ఆర్థిక గణాంకాలు ఈ వారం మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా హెచ్​డీఎఫ్​సీ, టెక్​ మంహీంద్రా, సన్​ఫార్మా, ఇండియన్ ఓవర్​సీస్​ బ్యాంకు, టాటా స్టీల్​, అశోక్ లేలాండ్​ సహా పలు దిగ్గజ సంస్థలు ఈ వారం రెండో త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నాయి. వీటి ఫలితాలు మార్కెట్లకు దిశా నిర్దేశం చేయనున్నట్లు స్టాక్​ నిపుణులు చెబుతున్నారు. అంచనాలకు అనుగుణంగా ఈ వారం స్టాక్ మార్కెట్లు ఫలితాలు సాధిస్తే.. సెన్సెక్స్, నిఫ్టీలు జీవనకాల గరిష్ఠాలను తాకే అవకాశముంది.

అక్టోబర్​ నెలలో రెండు సంస్థలు మినహా.. మిగత ఆటోమొబైల్​ సంస్థలు పెద్దగా వృద్ధి నమోదు చేయలేకపోయాయి. ఇది వాహన రంగ షేర్లపై కాస్త ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు నిపుణులు.

స్టాక్ మార్కెట్లు గత వారం రికార్డు స్థాయి దిశగా లాభాలు నమోదు చేశాయి. అయితే ఈ వారం వాటిని సొమ్ముచేసుకునేందుకు మదుపరులు ఆసక్తి చూపొచ్చని నిపుణులు అంటున్నారు. అదే జరిగితే స్టాక్​ మార్కెట్లు కాస్త ఒడుదొడుకులు ఎదుర్కోవచ్చు.

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు, విదేశీ పెట్టుబడులు, రూపాయి-డాలర్​ వ్యత్యాసం వంటివీ మదుపరుల సెంటిమంట్​ను ప్రభావితం చేసే చేయనున్నాయి.

ఇదీ చూడండి: ప్రపంచ మిలియనీర్ల దేశాల్లో భారత్ స్థానం ఎంతో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details