తెలంగాణ

telangana

ETV Bharat / business

పీఎంసీ బ్యాంక్​ అక్రమాల కేసులో ఈడీ సోదాలు - slaps money-laundering charge

పీఎంసీ బ్యాంక్​ కుంభకోణంలో అక్రమార్కుల పనిబట్టేందుకు ఈడీ రంగంలోకి దిగింది. మనీలాండరింగ్ కేసు నమోదుచేసి, ముంబయిలోని 6 చోట్ల సోదాలు చేపట్టింది.

పీఎంసీ బ్యాంక్​ అక్రమాల కేసులో ఈడీ సోదాలు

By

Published : Oct 4, 2019, 1:55 PM IST

భారతీయ బ్యాంకింగ్​ రంగాన్ని ఒక్కసారిగా కుదిపేసిన పీఎంసీ కుంభకోణంపై ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్​ దర్యాప్తు ప్రారంభించింది. ముంబయి పోలీసు ఆర్థిక నేరాల విభాగం ఎఫ్​ఆఐర్​ ఆధారంగా మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది ఈడీ. సాక్ష్యాధారాల కోసం ముంబయిలోని 6 ప్రదేశాల్లో సోదాలు చేసింది.

ఇదీ కేసు...

పీఎంసీ బ్యాంక్ అధికారులు, హౌసింగ్​ డెవలప్​మెంట్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్-హెచ్​డీఐఎల్​ ప్రమోటర్లు కుమ్మక్కయి భారీ స్థాయిలో రుణ అక్రమాలకు పాల్పడ్డారన్నది ప్రధాన ఆరోపణ. ఈ అప్పుల వివరాలను ఆర్బీఐకి చెప్పకుండా బ్యాంక్ ఉన్నతాధికారులు దాచిపెట్టి.... నకిలీ ఖాతాలతో మోసగించారని ప్రాథమిక విచారణలో తేలింది. ఇలా పీఎంసీ బ్యాంక్​ నుంచి హెచ్​డీఐఎల్​ ప్రమోటర్లు రూ.6,500కోట్లు కాజేసినట్లు సమాచారం.

ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చాక పీఎంసీ బ్యాంక్ కార్యకలాపాలపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. భారతీయ బ్యాంకింగ్ రంగ షేర్లు స్టాక్​మార్కెట్లలో తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి.

ఇదీ చూడండి: గృహ, వాహన రుణగ్రహీతలకు శుభవార్త

ABOUT THE AUTHOR

...view details