తెలంగాణ

telangana

ETV Bharat / business

పెట్రోల్, డీజిల్​ ధరలు పైపైకి.. ఒక్కరోజే..!

చమురు ధరల పెరుగుదలకు అనుగుణంగా.. దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తున్నాయి. గత రెండు నెలల్లో ఎప్పుడూ లేనంతగా నేడు ఒక్క రోజే ధరలు భారీగా పెరిగాయి. లీటర్​ పెట్రోల్ రూ.72.42... లీటర్​ డీజిల్​ 65.82కు చేరాయి.

By

Published : Sep 18, 2019, 4:48 PM IST

Updated : Oct 1, 2019, 2:05 AM IST

పట్రోల్​

దేశంలో పెట్రోల్​, డీజిల్​ ధరలు భారీగా పెరుగుతున్నాయి. దిల్లీలో నేడు లీటర్​ పెట్రోల్​ ధర 24 పైసలు పెరిగి రూ.72.42కు చేరింది. డీజిల్​ లీటర్​పై 25 పైసలు పెరిగి రూ.65.82గా ఉంది. ఒక్క రోజులోనే ఇంత ఎక్కువగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగటం జులై 5 తర్వాత ఇదే ప్రథమం.

సౌదీలోని ఆరామ్​కో చమురు శుద్ధి కేంద్రంపై హౌతీ తిరుగుబాటుదార్ల డ్రోన్​ దాడి తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్​, డీజిల్​ ధరలు పెంచుతున్నాయి. నెలాఖరులోగా ఆరామ్​కో శుద్ధి కేంద్రంలో ఉత్పత్తి సాధారణ స్థాయికి వస్తుందని సంస్థ అధికారులు ప్రకటిస్తున్నా.. భారత్ వంటి దేశాలపై చమురు ధరల ప్రభావం తగ్గడం లేదు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే పెట్రోల్,డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశముంది.

భారత్ ముడి చమురు అవసరాల్లో 83 శాతం మేర దిగుమతిపైనే ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో ధరల పెరుగుదల దేశ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రతికూల ప్రభావం చూపనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చూడండి: ఈ-సిగరెట్లపై నిషేధానికి కేంద్ర కేబినెట్​ ఆమోదం

Last Updated : Oct 1, 2019, 2:05 AM IST

ABOUT THE AUTHOR

...view details