తెలంగాణ

telangana

ETV Bharat / business

Paytm IPO: దేశంలో పేటీఎందే అతిపెద్ద ఐపీఓ! - ఐపీఓ కోసం సెబీకి పేటీఎం దరఖాస్తు

దేశంలో ఐపీఓల జోరు పెరుగుతోంది. ఇప్పటికే ఫుడ్​ డెలివరీ యాప్​ జొమాటో ఐపీఓకి రాగా.. ఇప్పుడు ప్రముఖ ఫిన్​టెక్ కంపెనీ పేటీఎం ఐపీఓకు సన్నాహాలు ముమ్మరం చేసింది. ఇందుకు సంబంధించి పేటిఎం మాతృ సంస్థ వన్​97 కమ్యూనికేషన్స్​.. సెబీకి దరఖాస్తు చేసుకుంది. సెబీ ఇందుకు అనుమతిస్తే.. దేశంలో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద ఐపీఓ కానుంది.

Paytm IPO updates
పీటీఎం ఐపీఓ అప్​డేట్స్​

By

Published : Jul 16, 2021, 12:44 PM IST

వ్యాపార వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న పేటీఎం ఇనీషియల్​ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ప్రక్రియలో మరో కీలక ముందడుగు పడింది. ఈ ఐపీఓకి సంబంధించిన వివరాలను పేటీఎం మాతృసంస్థ 'వన్‌97 కమ్యూనికేషన్స్‌' మార్కెట్‌ నియంత్రణా సంస్థ సెబీకి అందజేసింది. వీటిని సమీక్షించి సెబీ ఆమోదం తెలిపితే.. పేటీఎం ఐపీఓకి మార్గం క్లియర్‌ అయినట్లే.

ఈ ఐపీఓ ద్వారా మొత్తం రూ.16,600 కోట్లు సమీకరించనున్నట్లు సెబీకి పేటీఎం తెలిపింది. వీటిలో తాజా షేర్ల ద్వారా రూ.8,300 కోట్లు సమీకరించనున్నారు. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద మరో రూ.8,300 కోట్ల విలువ చేసే షేర్లను వాటాదార్లు ఐపీఓలో విక్రయానికి ఉంచనున్నారు.

సెబీ అమోదం లభిస్తే.. దేశంలో అతిపెద్ద ఐపీఓ ఇదే కానుంది. దశాబ్దం క్రితం కోల్‌ ఇండియా ఐపీఓ ద్వారా రూ.15,000 కోట్లను సమీకరించింది. పబ్లిక్‌ ఇష్యూల వైపు చూస్తున్న ఫిన్‌టెక్‌ కంపెనీలకు పేటీఎం ఐపీఓ ఓ మార్గదర్శకంగా నిలవనుంది. మరోవైపు ఆన్‌లైన్ ఆధారిత సేవలకు సంబంధించిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థాగత మదుపర్లు ఆసక్తి కనబరుస్తున్న తరుణంలో ఈ ఐపీఓ రానుండడం గమనార్హం. ఇప్పటికే జొమాటో ఐపీఓ నడుస్తుండగా.. మొబిక్విక్‌ సెబీకి దరఖాస్తు చేసుకుంది. పాలసీబజార్‌, నైకా కూడా ఇదే బాటలో పయనించనున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి:Sbi Alert: ఎస్​బీఐ వినియోగదారులకు హెచ్చరిక

ABOUT THE AUTHOR

...view details