తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఆటో' సంక్షోభం: మారుతీలో భారీగా ఉద్యోగాల కోత

ఆటోమొబైల్ సంక్షోభం ఆ రంగంలో కాంట్రాక్టు ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. కొనుగోళ్ల మందగమనం కారణంగా 3,000 మంది తాత్కాలిక ఉద్యోగులను తొలిగించింది దేశంలోని అతిపెద్ద ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ.

By

Published : Aug 17, 2019, 1:11 PM IST

Updated : Sep 27, 2019, 7:00 AM IST

మూరుతీ సుజుకీ

గత 9 నెలల నుంచి వాహన రంగం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. జులైలో అత్యల్ప వాహన అమ్మకాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వ్యయాలు తగ్గించుకునే పనిలో పడ్డాయి ఆటోమొబైల్ సంస్థలు.

మారుతీ సుజుకీ.. 3,000 మంది తాత్కాలిక ఉద్యోగులను తొలిగించింది. ఈ విషయాన్ని మారుతీ సుజుకీ ఇండియా(ఎంఎస్​ఐ) ఛైర్మన్​ ఆర్​సీ భార్గవ అధికారికంగా వెల్లడించడం గమనార్హం.

"అమ్మకాల్లో మందగమనం కారణంగా తాత్కాలిక ఉద్యోగుల కాంట్రాక్టును పునరుద్ధరించలేదు. దీని ప్రభావం శాశ్వత ఉద్యోగులపై ఉండదు. డిమాండుకు తగ్గట్లు ఉద్యోగులను పెంచుకోవడం, తగ్గించుకోవడం జరుగుతుంది. ఇదంతా వ్యాపారంలో భాగమే."
- ఆర్​సీ భార్గవ, ఎంఎస్​ఐ ఛైర్మన్​

ఆటోమొబైల్ పరిశ్రమ ద్వారా అమ్మకాలు, సర్వీసులు, బీమా, లైసెన్స్​​, ఫినాన్సింగ్, విడిభాగాలు, డ్రైవర్లు, పెట్రోల్​ పంపులు, రవాణా రంగాల్లో ఉద్యోగ కల్పన జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో.. అమ్మకాల విభాగంలో ఎక్కువగా ఉద్యోగాలు కోతకు గురయ్యే అవకాశం ఉందని భార్గవ తెలిపారు.

జులైలో అమ్మకాలు క్షీణించినప్పటికీ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగో త్రైమాసికాల్లో సానుకూల వృద్ధి ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంతో భారీగా అమ్మకాలు ఉండొచ్చని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం..

వాహనాలపై జీఎస్టీ తగ్గింపు వంటి సానుకూల చర్యలతో ప్రస్తుత పరిస్థితులను ప్రభుత్వం చక్కదిద్దొచ్చని అభిప్రాయపడ్డారు భార్గవ.

ఇటీవలే విద్యుత్ వాహనాలపై జీఎస్టీని తగ్గించింది ప్రభుత్వం. ఇదే తరహాలో హైబ్రిడ్​ వాహనాలపై డ్యూటీ తగ్గింపు, సీఎన్​జీ వాహనాలకు పన్ను మినహాయింపు ఇస్తే బాగుంటుందని ఆయన విశ్లేషించారు.

ఇదీ చూడండి: నాలుగు కెమెరాలతో ఒప్పో 'రెనో2'.. ధరెంతో తెలుసా?

Last Updated : Sep 27, 2019, 7:00 AM IST

ABOUT THE AUTHOR

...view details