ప్రభుత్వంతో పన్ను వివాదాల్లో చిక్కుకున్న 5 లక్షల కంపెనీల్లో ఐదింట ఒక శాతం కంపెనీలు 'వివాద్ సే విశ్వాస్' పథకాన్ని ఎంచుకున్నట్లు కేంద్ర ఆర్థిక కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే ఆదివారం వెల్లడించారు. దీని ద్వారా దాదాపు రూ.83,000 కోట్ల పన్ను వివాదానికి పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.
ప్రత్యక్ష పన్ను వివాదాల పరిష్కారం కోసం 'వివాద్ సే విశ్వాస్' పథకాన్ని గత ఏడాది తీసుకొచ్చింది కేంద్రం. వివిధ అప్పీలేట్ ఫోరమ్ల వద్ద పెండింగ్లో ఉన్న 4.8 లక్షల అప్పీళ్ల ద్వారా మొత్తం రూ.9.32 లక్షల పన్ను వివాదాలను పరిష్కరించడం దీని ముఖ్య ఉద్దేశం.