తెలంగాణ

telangana

రుణాలు ఇవ్వకుంటే ఫిర్యాదు చేయండి:ఆర్థిక మంత్రి

By

Published : Feb 8, 2020, 8:03 PM IST

Updated : Feb 29, 2020, 4:24 PM IST

ఇకపై బ్యాంకులు అకారణంగా ఎంఎస్​ఎంఈలకు రుణాలు నిరాకరిస్తే ఫిర్యాదు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఎంఎస్​ఎంఈలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేంద్రం పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు.

MSMEs can complain if banks deny loan without reason: FM
రుణాలు ఇవ్వకుంటే ఫిర్యాదు చేయండి

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు(ఎంఎస్ఎంఈ) కారణం లేకుండా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు నిరాకరిస్తే ఫిర్యాదులు చేయొచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఆమె ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలను వివరించేందుకు చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు.

ఫిర్యాదు చేసిన నకలును సంబంధిత బ్యాంకు మేనేజర్​కు పంపించాలని తెలిపారు ఆర్థిక మంత్రి.

భారత్​ వద్ద ప్రస్తుతం విదేశీ మారకం నిల్వలు గరిష్ఠ స్థాయిలో ఉన్నాయని, దేశ ఆర్థిక మూలాలు పటిష్ఠంగా ఉన్నాయని నిర్మల తెలిపారు. బడ్జెట్​లో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా అధికారులు కృషి చేశారని చెప్పారు.

ఆస్తులు కూడబెట్టేందుకు పెట్టుబడులు..

ఎంఎస్ఎంఈల గురించి ప్రధానంగా మాట్లాడుతూ.. వాటి మూలాలు దృఢంగా ఉన్నట్లు నిర్మల పేర్కొన్నారు. వారికి మౌలిక సదుపాయాలు కల్పించే పెట్టుబడులపై కేంద్రం దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. వీటి ద్వారా వారికి ఆస్తులు కూడబెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు నిర్మలా సీతారామన్.

గతంలో బ్యాంకులు తమ సంబంధీకులకు ఫోన్‌ బ్యాంకింగ్‌ ద్వారా రుణాలు మంజూరు చేయడం కారణంగా నిరర్ధక ఆస్తులు అధిక స్థాయిలో పెరిగాయి. అలాంటి వాటన్నింటినీ పరిష్కరించడానికి తమకు నాలుగేళ్లు సమయం పట్టిందని నిర్మల చెప్పారు.

ఇదీ చూడండి:కరోనా భయంతో కళ తప్పిన ఆటోఎక్స్​పో

Last Updated : Feb 29, 2020, 4:24 PM IST

ABOUT THE AUTHOR

...view details