తెలంగాణ

telangana

ETV Bharat / business

ఛోక్సీని భారత్​కు అప్పగించనున్న ఆంటిగ్వా! - కుంభకోణం

పీఎన్​బీ కేసు నిందితుడు, పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీని భారత్​కు అప్పగిస్తామని ఆంటిగ్వా ప్రధానమంత్రి గ్యాస్టన్​ బ్రౌన్​ ప్రకటించారు. న్యాయపరమైన అంశాలను ఉల్లంఘించినందుకు ఛోక్సీ పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నామని తెలిపారు. అయితే ఈ విషయమై ఎలాంటి సమాచారం అందలేదని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్​ స్పష్టంచేశారు.

ఛోక్సీని భారత్​కు అప్పగించనున్న ఆంటిగ్వా!

By

Published : Jun 25, 2019, 2:17 PM IST

పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​ కేసులో నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్​ ఛోక్సీకి ఆంటిగ్వా ప్రభుత్వం షాకిచ్చింది. న్యాయపరమైన ఉల్లంఘనలకు పాల్పడినందుకు ఆ దేశం కల్పించిన పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్టు ఆంటిగ్వా ప్రధాని గ్యాస్టన్​ బ్రౌన్​ ప్రకటించారు. ఫలితంగా ఛోక్సీని భారత్​కు అప్పగించేందుకు మార్గం సులువైంది.

"ఆయన(ఛోక్సీ) పౌరసత్వాన్ని మేం రద్దు చేస్తున్నాం. ఆయన్ను భారత్​కు పంపించివేస్తాం. మా దేశం నేరస్థులకు ఆశ్రయం ఎన్నటికీ కాబోదు. అయితే మొదటగా మేం ఇందుకు అంగీకరించలేదు. కానీ ఛోక్సీ న్యాయపరమైన అంశాలను ఉల్లంఘించారు. అందుకే మేం ఈ నిర్ణయం తీసుకున్నాం."
-గ్యాస్టన్​ బ్రౌన్​, ఆంటిగ్వా ప్రధాని

పీఎన్​బీ కుంభకోణం కేసులో ఛోక్సీతో పాటు ఆయన అల్లుడు, ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్​ మోదీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బ్యాంకును రూ.13,400 కోట్లు మోసం చేశారన్న ఆరోపణలపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. నీరవ్​ మోదీ బ్రిటన్​కు పారిపోగా అక్కడి ప్రభుత్వం ఇటీవలే అరెస్టు చేసింది.

సమాచారం లేదు: భారత్​

మీడియాలో వస్తున్న కథనాలపై భారత్​ స్పందించింది. ఆంటిగ్వా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రాలేదని భారత విదేశాంగ మంత్రి జైశంకర్​ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details