కొవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో దేశీయంగా చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఈ) సంస్థలకు సాయం చేసేందుకు మరో రూ.250 కోట్లు కేటాయించినట్లు అంతర్జాతీయంగా చెల్లింపుల సేవలు అందించే సాంకేతిక దిగ్గజం మాస్టర్కార్డ్ ప్రకటించింది. 2025 వరకు భారత్లో 100 కోట్ల డాలర్లకు పైగా పెట్టుబడులు పెడతామన్న సంస్థ గత నిర్ణయానికి అదనంగా ఈ సాయం ప్రకటించింది.
చిన్న వాణిజ్య సంస్థల డిజిటలీకరణకు, ఆయా సంస్థలు రుణాలు సులభతరంగా పొందేలా సాయం చేసేందుకు, మహిళా ఔత్సాహికవేత్తలను ప్రోత్సహించేందుకు రూ.250 కోట్లు వినియోగిస్తామని మాస్టర్కార్డ్ దక్షిణాసియా అధిపతి పోరష్ సింగ్ తెలిపారు.