తెలంగాణ

telangana

ETV Bharat / business

మారుతీ వాహనాల్లో లోపం- 40,453 యూనిట్లు రీకాల్

మల్టీ పర్పస్ వాహనమైన 'ఈకో' మోడల్​లో సాంకేతిక సమస్యను గుర్తించింది మారుతీ సుజుకీ. 40,453 యూనిట్లను రీకాల్ చేస్తున్నట్లు గురువారం ప్రకటించింది.

By

Published : Nov 5, 2020, 4:53 PM IST

MARUTI SUZUKI EECO RECALL
మారుతీ ఈకోలో హెడ్​ల్యాంప్ లోపం

దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ భారీ రీకాల్​ ప్రకటించింది. మల్టీ పర్పస్ వాహనమైన 'ఈకో' హెడ్​ ల్యాంప్​లో సమస్యలున్నట్లు గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మొత్తం 40,453 ఈకో వాహనాలను రీకాల్ చేయనున్నట్లు వివరించింది.

2019 నవంబర్ 4 నుంచి 2020 ఫిబ్రవరి 25 మధ్య తయారైన ఈకో వాహనాలకు మాత్రమే రీకాల్ వర్తిస్తుందని తెలిపింది.

కంపెనీ అధికారిక డీలర్లే రీకాల్ చేసిన వాహనాలను తనిఖీ చేసి.. అవసరమైతే ఉచితంగానే సమస్యను పరిష్కరిస్తారని మారుతీ స్పష్టం చేసింది. ఇందుకోసం వినియోగదారులను డీలర్లే స్వయంగా సంప్రదిస్తారని వెల్లడించింది.

ఇదీ చూడండి:పసిడి కాస్త ప్రియం- వెండిదీ అదే దారి

ABOUT THE AUTHOR

...view details