తెలంగాణ

telangana

కష్టకాలంలోనూ మారుతీ జోరు- 4% పెరిగిన లాభం

By

Published : Jan 28, 2020, 3:41 PM IST

Updated : Feb 28, 2020, 7:17 AM IST

దేశీయ వాహన రంగ దిగ్గజం మారుతీ సుజుకీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక లాభాల్లో 4.13 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ సమయంలో మారుతీ సుజుకీ 1,587.4 కోట్లు ఆర్జించింది.

maruti
మారితీ సుజుకీ

వాహన రంగ సంక్షోభంలోనూ దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ మంచి స్వల్ప వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో సంస్థ లాభాలు 4.13 శాతం పెరిగాయి. 2019 డిసెంబర్​తో ముగిసిన త్రైమాసికానికి మారుతీ సుజుకీ రూ.1,587.4 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది. ముడి సరుకుల ధరలు తగ్గడం, కార్పొరేట్ పన్ను తగ్గింపు, సంస్థ చేపట్టిన పొదుపు చర్యలే క్యూ3లో లాభాలకు ప్రధాన కారణం.

2018-19 ఆర్థిక సంవత్సరం అక్టోబర్​-డిసెంబర్ త్రైమాసికంలో మారుతీ సుజుకీ రూ.1,524.5 కోట్ల లాభాన్ని ఆర్జించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో సంస్థ ఆదాయం రూ.20,721.8 కోట్లుగా నమోదైనట్లు మారుతీ సుజుకీ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ ఆదాయం రూ. 19,680.7 కోట్లుగా ఉంది.

అమ్మకాలు ఇలా..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్​-డిసెంబర్ త్రైమాసికంలో మారుతీ సుజుకీ 4,13,698 వాహనాలు విక్రయించింది. వీటిలో దేశీయ అమ్మకాలు 4,13,698 యూనిట్లు, ఎగుమతులు 23,663 యూనిట్లుగా ఉన్నాయి.

2018-19లో క్యూ3తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అదే సమయంలో సంస్థ విక్రయాలు 2 శాతం మేర పెరిగాయి.

తొమ్మిది నెలల్లో ఇలా

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్​-డిసెంబర్ మధ్య మారుతీ సుజుకీ పూర్తి లాభం 25.16 శాతం తగ్గి రూ.4,355.3 కోట్లుగా నమోదైంది. ఆదాయం 11.6 శాతం క్షీణించి రూ.57,452.3 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ లాభం రూ.5,819.8 కోట్లుగా, ఆదాయం రూ.64,594.5 కోట్లుగా ఉండటం గమనార్హం.

అమ్మకాల్లో 16 శాతం క్షీణత..

మారుతీ సుజుకీ 2019-20 ఏప్రిల్-డిసెంబర్ మధ్య 16.1 శాతం క్షీణతతో 11,78,272 వాహనాలను విక్రయించగలిగింది. వీటిలో దేశీయ విక్రయాలు 11,00,689 యూనిట్లు, ఎగుమతులు 77,574 యూనిట్లుగా ఉన్నాయి.

ఇదీ చూడండి:వొడా-ఐడియాకు బై- జియోకు జై... ఎందుకిలా?

Last Updated : Feb 28, 2020, 7:17 AM IST

ABOUT THE AUTHOR

...view details