పరారీలో ఉన్న రుణఎగవేతదారు, భారతీయ వ్యాపారవేత్త విజయ్ మాల్యాను భారత్కు తీసుకొచ్చే అంశమై న్యాయపరమైన ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. ఆయనను ఎప్పుడైనా భారత్కు తీసుకొచ్చే అవకాశం ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు చెందిన ఓ అధికారి అనధికారికంగా వెల్లడించినట్లు సమాచారం.
ప్రక్రియ షురూ..
సీబీఐ, ఈడీ మాల్యాను వెనక్కి తెచ్చేందుకు ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించాయి. భారత్కు వచ్చిన వెంటనే కస్టడీకి తీసుకోవాలని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. అయితే మాల్యాను ఎప్పుడు వెనక్కి తీసుకొస్తారనే అంశమై స్పష్టత లేదని తెలుస్తోంది.