తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆటోమొబైల్స్​పై జీఎస్టీ తగ్గించాలి: ఆనంద్​ మహీంద్రా

ఆటోమొబైల్స్​పై జీఎస్టీ తగ్గించాలని అభిప్రాయపడ్డారు మహీంద్రా సంస్థల ఛైర్మన్​ ఆనంద్​ మహీంద్రా. ఇది ఆర్థికవ్యవస్థకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ఆటో మొబైల్​ రంగం చిన్న కంపెనీలు, ఉపాధి కల్పనపై పెను ప్రభావం చూపిస్తుందని తెలిపారు.

By

Published : Jun 26, 2019, 4:06 PM IST

ఆటోమొబైల్స్​పై జీఎస్టీ తగ్గించాలి: ఆనంద్​ మహీంద్రా

దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలంటే.. ఆటోమొబైల్స్​పై వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)ని తగ్గించాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు మహీంద్రా సంస్థల ఛైర్మన్​ ఆనంద్​ మహీంద్రా. చిన్న కంపెనీలు, ఉపాధి కల్పనను ఈ రంగం అతిగా ప్రభావితం చేస్తుందని తెలిపారు.

ఇటీవలి కాలంలో ఆటోమొబైల్‌ విక్రయాలు భారీగా క్షీణించాయి. మే నెలలో ప్యాసింజర్​ వాహనాల అమ్మకాలు 20 శాతానికిపైగా తగ్గాయి. విక్రయాలు ఇంతలా తగ్గడం 18 ఏళ్లలో తొలిసారి. గతంలో 2001 సెప్టెంబర్​లో అమ్మకాలు 21.91 శాతం పతనమయ్యాయి. ​

ఫెడరేషన్​ ఆఫ్​ ఆటోమొబైల్​ డీలర్స్​ అసోసియేషన్స్​(ఎఫ్​ఏడీఏ) మాజీ అధ్యక్షుడు.. జాన్​ పాల్​ ఇటీవలి ఓ సదస్సులో భారత ఆటోమొబైల్​ రంగం వృద్ధి దిశగా పరుగులు తీయాలంటే జీఎస్టీ తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేశంలో మూడో వంతు ఉద్యోగాలు ఈ రంగంలోనే ఉన్నాయన్నారాయన. ఈయన వ్యాఖ్యలను 'ఆటోకార్​ ప్రొఫెషనల్​' అనే ఆటోమేటివ్​ మేగజీన్ ​ ట్వీట్​ చేసింది.
దీనికి బదులిస్తూ ట్వీట్​ చేశారు ఆనంద్​ మహీంద్రా.

''ఆటోమొబైల్​ రంగం ఓ మందారా పర్వతం. దేశ ఆర్థిక వృద్ధికి ఇది కీలకం. చిన్న కంపెనీలు, ఉపాధి కల్పనపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జీఎస్టీ తగ్గిస్తే ఆర్థికవ్యవస్థకు ప్రయోజనమే.''

- ఆనంద్​ మహీంద్రా, మహీంద్రా సంస్థల ఛైర్మన్​

ABOUT THE AUTHOR

...view details