తెలంగాణ

telangana

ETV Bharat / business

మొబైల్​ రంగంలో అగ్రగామి దిశగా ఎల్​జీ ప్రయత్నాలు

కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్​ సంస్థ ఎల్​జీ భారతదేశంలో 5జీ మొబైల్​ సెగ్మెంట్​లో అగ్రగామిలా నిలిచేలా ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే 5జీ అందుబాటులో ఉన్న దేశాల్లో వీ5 అనే ఫోన్​ను విక్రయిస్తోందీ సంస్థ. భారత్​లో 5జీ అందుబాటులోకి వచ్చిన వెంటనే ఈ ఫోన్​ను విడుదల చేయనున్నట్లు ఎల్​జీ భారత మొబైల్స్​ బిజినెస్​ సారథి అధ్విత్​ వైద్యా తెలిపారు.

By

Published : Jun 27, 2019, 5:48 PM IST

మొబైల్​ రంగంలో అగ్రగామి దిశగా ఎల్​జీ ప్రయత్నాలు

ప్రముఖ ఎలక్ట్రానిక్​ సంస్థ ఎల్​జీ.. 5జీ మొబైల్​ సెగ్మెంట్​లో దేశంలోనే అగ్రగామిలో నిలిచేలా ప్రయత్నాలు చేస్తోంది. భారత్​లో 5జీ అందుబాటులోకి వచ్చిన వెంటనే వీ5 అనే 5జీ ఫోన్​ను విడుదల చేయనున్నట్లు తెలిపారు ఆ సంస్థ భారత మొబైల్స్​ బిజినెస్​ సారథి అద్విత్​ వైద్యా.

2020 ద్వితీయార్థంలోగా దేశంలో 5జీ నెట్​వర్క్​ అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

డబ్ల్యూ సిరీస్​ ఫోన్ల ఆవిష్కరణ...

ఎల్​జీని వినియోగదారులకు మరింత చేరువగా తీసుకెళ్లేందుకు.. భారతీయ అవసరాలకు అనుగుణంగా ఉండే డబ్ల్యూ సిరీస్​ ఫోన్ల శ్రేణిని హైదరాబాద్​లో ఆవిష్కరించింది. డబ్ల్యూ 10, డబ్ల్యూ 30, డబ్ల్యూ 30 ప్రో పేర్లతో మూడు ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇవి ప్రస్తుతానికి అమెజాన్​లో మాత్రమే లభించనున్నాయి.

మరో రెండు ఫోన్లను కూడా ఈ సంవత్సరమే తీసుకురానున్నట్లు వెల్లడించారు అద్విత్​ వైద్యా. స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో రెండంకెల వాటాను ఆశిస్తున్నట్లు తెలిపారు.

తెలుగు రాష్ట్రాలు భళా....

దేశవ్యాప్త సరాసరి కంటే తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ల మార్కెట్‌ వృద్ధి ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. దేశంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వార్షికంగా 12 నుంచి 15 శాతం వృద్ధి రేటును సాధిస్తోందని పేర్కొన్నారు. అదే సమయంలో మధ్య శ్రేణి ధర ఫోన్ల మార్కెట్‌ మాత్రం దాదాపు 25 నుంచి 30 శాతం వేగంగా దూసుకెళ్తోందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details