4జీ మొబైల్ ఫోన్లు, ఇతర డివైజ్ల ధరలు తగ్గేందుకు.. రియల్మీ సహా ఇతర కంపెనీలతో కలిసి పని చేస్తున్నట్లు రిలయన్స్ జియో ప్రకటించింది. దిల్లీలో జరుగుతున్న ఇండియన్ మొబైల్ కాంగ్రెస్(ఐఎంసీ)లో ఈ విషయం వెల్లడించింది.
'ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా మంది ఇంకా 2జీ ఫోన్లే వాడుతున్నారు. వారంతా 4జీ, 5జీ ఫోన్లు, ఇతర డివైజ్లు వాడేందుకు.. తక్కువ ధరలో వాటిని అందించాల్సిన అవసరం ఉంది. అందుకే రియల్మీ, సహా ఇతర కంపెనీలతో కలిసి పని చేస్తున్నాం.' అని జియో పేర్కొంది.