తెలంగాణ

telangana

జియో 3నెలల ఆదాయం రూ.10,900 కోట్లు

By

Published : Aug 28, 2019, 1:03 PM IST

Updated : Sep 28, 2019, 2:22 PM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.10,900 కోట్ల ఆదాయన్ని గడించింది రిలయన్స్ జియో. మార్కెట్లోకి వచ్చిన స్వల్ప కాలంలోనే భారతీ ఎయిర్​టెల్​, వొడాఫోన్-ఐడియా వంటి దిగ్గజ సంస్థలను వెనక్కి నెట్టి ఈ ఘనతను సాధించింది జియో.

రిలయన్స్ జియో

టెలికాం రంగంలోకి ప్రవేశించిన మూడేళ్లకే ఆదాయంలోనూ భారతీ ఎయిర్​టెల్​, వొడాఫోన్-​ఐడియా సంస్థలను వెనక్కి నెట్టింది రిలయన్స్​ జియో. ముకేశ్​ అంబానీ నేతృత్వంలోని ఈ సంస్థ ఏప్రిల్ నుంచి జూన్​ త్రైమాసింకంలో రూ.10,900 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. టెలికాం నియంత్రణ సంస్థ 'ట్రాయ్' వెల్లడించిన తాజా గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది.

జియో తర్వాతి స్థానంలో రూ.10,707 కోట్ల ఆదాయంతో భారతీ ఎయిర్​టెల్​ రెండో స్థానంలో, రూ.9,809 కోట్ల ఆదాయంతో వొడాఫోన్​ ఐడియా మూడో స్థానంలో ఉన్నాయి.

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలు బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.4,296 కోట్లు, ఎంటీఎన్‌ఎల్‌ రూ.408 కోట్ల ఆదాయాన్ని మాత్రమే గడించాయి.

ఇదీ చూడండి: మాకు మీ సాయం వద్దు: కేంద్రంతో ఎస్​బీఐ

Last Updated : Sep 28, 2019, 2:22 PM IST

ABOUT THE AUTHOR

...view details