తెలంగాణ

telangana

By

Published : Apr 20, 2019, 11:14 PM IST

ETV Bharat / business

రాష్ట్రపతి జోక్యం కోరిన జెట్​ ఎయిర్​వేస్​ ఉద్యోగులు

జెట్​ ఎయిర్​వేస్​ ఉద్యోగులు రాష్ట్రపతి, ప్రధానికి లేఖ రాశారు. జీతాల బకాయిలు, అత్యవసర నిధుల విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు.

రాష్ట్రపతి జోక్యం కోరిన జెట్​ ఎయిర్​వేస్​ ఉద్యోగులు

ఇటీవల తాత్కాలికంగా మూతపడిన జెట్​ ఎయిర్​వేస్ సంస్థ​ ఉద్యోగులు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. జీతాల బకాయిల చెల్లింపు, అత్యవసర నిధుల ప్రక్రియలో వేగవంతం చేసేందుకు జోక్యం చేసుకోవాలని కోరారు.

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి మూతపడిన జెట్​ ఎయిర్​వేస్​లో సుమారు 23 వేల మంది పని చేస్తున్నారు.

సంస్థ భవిష్యత్తుపై అనిశ్చితి మధ్య రెండు ఉద్యోగ సంఘాలు భారత పైలెట్ల సంక్షేమ సంఘం (ఎస్​డబ్ల్యూఐపీ), జెట్ విమాన నిర్వహణ ఇంజనీర్స్ సంక్షేమ సంఘం (జేఏఎమ్​ఈడబ్ల్యూఏ)లు తమ బకాయిల చెల్లింపునకు సహాయం చేయాలని రాష్ట్రపతి, ప్రధానమంత్రికి లేఖ రాశాయి.

"ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాం. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు జెట్​ ఎయిర్​వేస్​ యాజమాన్యానికి సూచించండి. అత్యవసర నిధులు సమకూర్చుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని సైతం కోరుతున్నాం. ఈ పరీక్షా కాలంలో ప్రతి క్షణం, ప్రతి నిర్ణయం క్లిష్టంగా మారుతోంది. "
- లేఖలో ఉద్యోగులు

కొన్ని నెలల అనిశ్చితి తరువాత ఈ నెల 17న జెట్​ ఎయిర్​వేస్​ తన సేవలను తాత్కాలికంగా మూసివేసింది.

ఆర్థిక మంత్రిని కలిసిన ఉద్యోగులు

ఆర్థిక సంక్షోభంతో మూతపడిన జెట్​ ఎయిర్​వేస్​ సంస్థ ఉద్యోగులు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్​ జైట్లీని కలిసి లేఖ అందించారు. జెట్​ ఎయిర్​వేస్​లో వాటా కొనుగోలు బిడ్​ల ప్రక్రియ బహిరంగంగా, పారదర్శకంగా నిర్వహించాలని కోరినట్లు సంస్థ కార్యనిర్వాహణ అధికారి వినయ్​ దూబే తెలిపారు.

రాష్ట్రపతి జోక్యం కోరిన జెట్​ ఎయిర్​వేస్​ ఉద్యోగులు

"మేము ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశాం. మా సమస్యను విన్నవించాం. బిడ్​ ప్రక్రియ బహిరంగంగా, పారదర్శకంగా నిర్వహించాలని కోరాం. దానికి ఆయన భరోసా కల్పించారు. జెట్​ ఎయిర్​వేస్​లో వాటా కొనుగోలుకు నాలుగు సంస్థలు సుముఖంగా ఉన్నాయని తెలిపారు."
- వినయ్​ దూబే, జెట్​ ఎయిర్​వేస్​ సీఈఓ.

ఇదీ చూడండీ: రాహుల్ గాంధీ​ పౌరసత్వంపై వివాదం..

ABOUT THE AUTHOR

...view details