తెలంగాణ

telangana

ETV Bharat / business

ఒక్క రోజులో రూ.7 లక్షల కోట్లు సంపాదించారు..!

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి నమోదిత కంపెనీల్లోని మదుపరుల సంపద కేవలం ఒక్క రోజులో రూ.7 లక్షల కోట్లు పెరిగింది. కార్పొరేట్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం ప్రకటించిన ఉద్దీపనతో నమోదైన అత్యధిక లాభాలే ఇందుకు కారణం.

By

Published : Sep 20, 2019, 6:26 PM IST

Updated : Oct 1, 2019, 8:47 AM IST

మదుపరుల సంపద

గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా ఒక్క రోజులోనే స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. కార్పొరేట్లకు 34 శాతంగా ఉన్న సుంకాన్ని 25 శాతానికి తగ్గిస్తూ కేంద్రం భారీ ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఒక్కసారిగా వెల్లువెత్తిన కొనుగోళ్లు చివరి వరకు కొనసాగాయి.

ఈ భారీ కొనుగోళ్లతో బీఎస్​ఈ నమోదిత కంపెనీల్లో మదుపరుల సంపద రూ.6,82,938.6 కోట్లు పెరిగింది. తాజా వృద్ధితో మదుపరుల పూర్తి సంపద 1,45,37,378.01 కోట్లకు చేరింది.

ఇదూ చూడండి: కార్పొరేట్​ పన్ను తగ్గింపు చారిత్రక నిర్ణయం: మోదీ

Last Updated : Oct 1, 2019, 8:47 AM IST

ABOUT THE AUTHOR

...view details