తెలంగాణ

telangana

By

Published : Dec 18, 2019, 12:39 PM IST

ETV Bharat / business

రూ.5.6 కోట్ల జరిమానా చెల్లింపునకు సిద్ధమైన ఇన్ఫీ!

వీసాల విషయంలో అక్రమాల ఆరోపణల వ్యవహారంలో అమెరికా కాలిఫోర్నియా ప్రభుత్వంతో రాజీ కుదుర్చుకుంది ఇన్ఫోసిస్. ఏకంగా రూ.5.6 కోట్ల అపరాధ రుసుము చెల్లించేందుకు సిద్ధమైంది.

INFOSYS
ఇన్ఫోసిస్​

దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్​.. కాలిఫోర్నియా ప్రభుత్వానికి 8లక్షల డాలర్లు(రూ.5.6 కోట్లు) అపరాధ రుసుము చెల్లించేందుకు సిద్ధమైంది. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ ఉద్యోగులతో పని చేయించుకోవడం, పన్ను చెల్లింపుల్లో మోసం వంటి ఆరోపణలతో తలెత్తిన వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఇన్ఫీ ఈ మొత్తాన్ని చెల్లించనున్నట్లు తెలిసింది.

అసలు విషయం ఇది...

ఇన్ఫోసిస్​కు చెందిన దాదాపు 500 మంది ఉద్యోగులను హెచ్​1-బీ (ఉద్యోగ వీసా) వీసాకు బదులు.. బీ-1(బిజినెస్ వీసా) వీసాతో కాలిఫోర్నియా రాష్ట్రంలో పని చేయించుకున్నారనేది ప్రధాన ఆరోపణ. ఈ ఉల్లంఘనతో కాలిఫోర్నియా ప్రభుత్వానికి చెల్లించాల్సిన వేర్వేరు పన్నులను ఇన్ఫీ ఎగ్గొట్టినట్లు అభియోగాలు ఉన్నాయి.

ఈ వ్యవహారంపై ఇన్ఫోసిస్​ న్యాయపరమైన విచారణ ఎదుర్కోవాల్సి ఉంది. అయితే అలాంటి ఇబ్బందులు లేకుండా కాలిఫోర్నియా అటార్నీ జనరల్​ జేవియర్ బెసెర్రాతో రాజీ ఒప్పందం కుదుర్చుకుంది ఇన్ఫీ. అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు తోసిపుచ్చుతూనే భారీ మొత్తంలో జరిమానా కట్టేందుకు సిద్ధమైంది. ఇదే విషయాన్ని భారతీయ స్టాక్​ మార్కెట్లకు బుధవారం తెలియజేసింది.

ఫెడరల్ అధికారులకు తప్పుడు దస్త్రాలు సమర్పించిన ఆరోపణలతో.. 2017లోనూ న్యూయార్క్​ ప్రభుత్వానికి​ మిలియన్​ డాలర్ల అపరాధ రుసుము చెల్లించేందుకు ఇన్ఫోసిస్​ అంగీకరించింది.

ఇదీ చూడండి:రెండేళ్లలో మారుమూల గ్రామాలకూ బ్రాడ్​బ్యాండ్​ సేవలు!

ABOUT THE AUTHOR

...view details