ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్.. 2020-21 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి గానూ రూ.5,076 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ లాభం 17.5 శాతం ఎక్కువని తెలిపింది. ఇదే సమయానికి ఆదాయం కూడా 13.1 శాతం పెరిగి.. రూ.26,311 కోట్లుగా నమోదైనట్లు వెల్లడించింది.
2020-21 పూర్తి సంవత్సర నికర లాభం రూ.19,351 కోట్లుగా పేర్కొంది ఇన్ఫీ. ఆదాయం రూ.1,00,472 కోట్లుగా వివరించింది.