తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఉద్యోగుల టీకా ఖర్చులు మేమే భరిస్తాం' - ఉద్యోగులకు టీకా ఖర్చులు భరించనున్న యాక్సెంచర్​

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్​ జోరందుకున్న నేపథ్యంలో టెక్​ దిగ్గజాలు ఇన్ఫోసిస్​, యాక్సెంచర్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. తమ సిబ్బందికి కరోనా టీకా కోసమయ్యే ఖర్చులను తామే భరించనున్నట్లు ప్రకటించాయి.

Corona vaccine to  Infosys and Accenture employees for free
ఇన్ఫీ ఉద్యోగులకు కరోనా టీకా ఫ్రీ

By

Published : Mar 4, 2021, 1:51 PM IST

ప్రముఖ ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, యాక్సెంచర్​లు ఉద్యోగుల పట్ల తమ నిబద్ధతను చాటుకున్నాయి. తమ సిబ్బందికి కరోనా టీకా కోసమయ్యే ఖర్చును భరిస్తామని ప్రకటించాయి.

'మా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు కరోనా టీకా కోసమయ్యే ఖర్చును భరిస్తాం.' అని ఇన్ఫోసిస్​ పేర్కొంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే ఉద్యోగులకు టీకా వేసేందుకు హెల్త్​కేర్ విభాగాలతో భాగస్వామ్యం కుదుర్చుకోనున్నట్లు తెలిపింది.

అమెరికా కేంద్రంగా పని చేస్తున్న మరో టెక్​ దిగ్గజం యాక్సెంచర్​ భారతీయ విభాగం కూడా తమ ఉద్యోగులకు, వారిపై ఆధారపడిన వారికి వ్యాక్సినేషన్​ కోసమయ్యే ఖర్చులు భరించనున్నట్లు తెలిపింది.

భారతీయ అతిపెద్ద టెక్​ దిగ్గజం టీసీఎస్​ కొవిడ్​-19 పరీక్ష, వ్యాక్సినేషన్ నిర్వహణ సూట్​ను ఆవిష్కరించింది. ఇది టెస్టింగ్​ నుంచి వ్యాక్సినేషన్​ వరకు ఉన్న దశలను క్రమబద్దీకరించేందుకు ఉపయోగపడుతుందని వివరించింది. దీనితో వేగంగా పరీక్షలు, వ్యాక్సినేషన్​కు వీలవుతుందని టీసీఎస్​ పేర్కొంది.

ఇదీ చదవండి:జీఎస్​టీ విధిస్తే రూ.75కే లీటర్ పెట్రోల్​!

ABOUT THE AUTHOR

...view details