తెలంగాణ

telangana

By

Published : Feb 7, 2020, 11:24 PM IST

Updated : Feb 29, 2020, 2:14 PM IST

ETV Bharat / business

స్మార్ట్​ఫోన్​ మార్కెట్లో దూసుకుపోతున్న భారత్

స్మార్ట్​ఫోన్ మార్కెట్లో భారత్​ దూసుకుపోతున్నట్లు ఓ ప్రముఖ సంస్థ నివేదిక తెలిపింది. 2019లో 152.5 మిలియన్ల స్మార్ట్​ఫోన్లు అమ్ముడవ్వగా.. మొత్తం మొబైల్​ ఫోన్ల విక్రయాలు 282.9 మిలియన్లుగా ఉన్నట్లు నివేదికలో తేలింది.

SMARTPHONE
స్మార్ట్​ఫోన్​ మార్కెట్లో దూసుకుపోతున్న భారత్

భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ ఏటేటా గణనీయ వృద్ధి సాధిస్తూ దూసుకెళ్తోంది. 2019లో 8 శాతం వృద్ధిని నమోదు చేసిన భారత్‌.. ప్రపంచంలోనే చైనా తర్వాత రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌గా అవతరించినట్లు ప్రముఖ పరిశోధనా సంస్థ ఐడీసీ వెల్లడించింది. 2020లో కూడా ఇదే తరహాలో వృద్ధి నమోదయ్యే అవకాశాలున్నట్లు ఐడీసీ పేర్కొంది.

ఐడీసీ డేటా ప్రకారం.. 2019లో మొత్తంగా 282.9 మిలియన్ల మొబైల్​ ​ఫోన్లు విక్రయమైనట్లు తెలిసింది.

కంపెనీల వారీగా..

షియోమీవి 43.6 మిలియన్‌ యూనిట్లు విక్రయించింది. మరే ఇతర సంస్థకు సాధ్యంకానంతగా 2019లో ఈ సంస్థ 9.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ సమయంలో స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో షియోమీ వాటా వాటా 28.6 శాతంగా ఉంది. శాంసంగ్‌ (20.3 శాతం), వివో (15.6 శాతం), ఒప్పో (10.7) శాతం, రియల్‌ మీ (10.6) శాతం మార్కెట్‌ వాటాతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

2019 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో మొత్తం 36.9 మిలియన్ యూనిట్ల స్మార్ట్‌ఫోన్‌ షిప్‌మెంట్స్‌తో 5.5 శాతం వృద్ధి నమోదైంది. కానీ గత త్రైమాసికంతో పోల్చితే 20.8 శాతం తగ్గుదల నమోదు అయింది.

డిసెంబర్‌ త్రైమాసికంలో షియోమీ ఏకంగా 15.9 శాతం వృద్ధిని నమోదు చేసి మార్కెట్‌లో 29 శాతం వాటా దక్కించుకుంది. వివో (18.8 శాతం), శాంసంగ్‌ (15.5 శాతం), ఒప్పో (13 శాతం), రియల్‌ మీ (12.8 శాతం) మార్కెట్‌ వాటాతో తర్వాతి స్థానంలో ఉన్నాయి. భారత స్మార్ట్​ఫోన్‌ మార్కెట్‌లో భారీ వృద్ధిని నమోదు చేస్తున్నందుకు సంతోషంగా ఉందని షియోమీ ఉపాధ్యక్షుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఇండియా) మను జైన్‌ తెలిపారు.

ఫీచర్ ఫోన్ల విక్రయామలు మాత్రం గత ఏడాది చివరి త్రైమాసికంలో 21.1 శాతం క్షీణించాయి. 2019 చివరి మూడు నెలల్లో 30.1 మిలియన్​ యూనిట్లు విక్రయమైనట్లకు నివేదిక తెలిపింది.

పెరిగిన ఆన్‌లైన్‌ విక్రయాలు...

వివిధ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లపై అందిస్తున్న ఆఫర్లు, డిస్కౌంట్లు, కంప్లీట్‌ ప్రొటెక్షన్‌ ఆఫర్స్‌, బైబ్యాక్‌, ఎక్ఛేంజ్‌ ఆఫర్స్‌, నో కాస్ట్‌ ఈఎంఐ లాంటి సదుపాయాలతో ఆన్‌లైన్‌ విక్రయాలు 2019లో 41.7 శాతం పెరిగాయి. 2018తో పోలిస్తే ఇది 18.4 శాతం ఎక్కువ అని ఐడీసీ ఇండియా రీసెర్చ్‌ మేనేజర్‌ ఉపాసనా జోషి తెలిపారు.

ఇదీ చూడండి:వ్యాపార ప్రకటనల మోసాలపై కేంద్రం కొరడా!

Last Updated : Feb 29, 2020, 2:14 PM IST

ABOUT THE AUTHOR

...view details