తెలంగాణ

telangana

By

Published : Nov 12, 2019, 6:35 PM IST

ETV Bharat / business

ప్రగతి సూచీల నేలచూపులు... 2019-20లో వృద్ధి 5శాతమే!

ఆర్థిక మాంద్యం భయాలను మరింత పెంచుతూ ఎస్​బీఐ తాజా నివేదిక విడుదల చేసింది. 2019-20లో జీడీపీ వృద్ధి రేటు 5 శాతానికే పరిమితం కావచ్చని అంచనా వేసింది.

జీడీపీ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాను 5 శాతానికి తగ్గించింది ఎస్​బీఐ. ఇంతకు ముందు ఎస్​బీఐ విడుదల చేసిన నివేదికలో వృద్ధి రేటును 6.1 శాతంగా అంచనా వేయడం గమనార్హం.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలోనూ జీడీపీ వృద్ధి 4.2 శాతానికే పరిమితమవుతుందని ఎస్​బీఐ తాజా నివేదికలో పేర్కొంది. వాహన రంగ సంక్షోభం, కీలక రంగాల్లో నెలకొన్న స్తబ్దత, నిర్మాణ, మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు తగ్గడం ఇందుకు ప్రధాన కారణమని ఎస్​బీఐ నివేదిక వెల్లడించింది.

2019-20 తొలి త్రైమాసికంలోనూ జీడీపీ వృద్ధి ఆరేళ్ల కనిష్ఠం వద్ద 5 శాతానికి క్షీణించిన విషయం తెలిసిందే.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి మందగించినా.. 2020-21లో మాత్రం 6.2 శాతానికి పెరగొచ్చని నివేదిక అభిప్రాయపడింది.

ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేందుకు డిసెంబర్​లో జరిగే ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో 25 బేసిస్​ పాయింట్ల రెపో తగ్గే అవకాశమున్నట్లు ఎస్​బీఐ అంచనా వేసింది. గత నెలలో జరిగిన ఎంపీసీ సమావేశంలోనూ.. 25 బేసిస్​ పాయింట్ల రెపో రేటు తగ్గించింది ఆర్బీఐ.

జీడీపీపై.. ఆర్బీఐ ఇటీవల విడుదల చేసిన నివేదికలోనూ వృద్ధి రేటు అంచనాను 6.9 నుంచి 6.1 శాతానికి తగ్గించింది.

ఇదీ చూడండి: నకిలీ వార్తలపై కఠిన చర్యలకు ట్విట్టర్​ సంసిద్ధం!

ABOUT THE AUTHOR

...view details