తెలంగాణ

telangana

ETV Bharat / business

'భారత ఆర్థిక పరిస్థితి మరింత దయనీయం'

భారత ఆర్థిక వృద్ధిపై అంతర్జాతీయ ద్రవ్య నిధి ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం అంచనా వేసిన స్థాయికన్నా తక్కువగా జీడీపీ వృద్ధి నమోదవుతున్నట్లు తాజా ప్రకటనలో వెల్లడించింది.

By

Published : Sep 13, 2019, 6:53 PM IST

Updated : Sep 30, 2019, 11:57 AM IST

'భారత ఆర్థిక పరిస్థితి మరింత దయనీయం'

దేశ ఆర్థిక వృద్ధి ఆశించిన దానికంటే ఇంకా తక్కువగా నమోదవుతున్నట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్​) వెల్లడించింది. కార్పొరేట్, పర్యావరణ నియంత్రణ అనిశ్చితులకు తోడు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల సంక్షోభం ఇందుకు ప్రధాన కారణంగా ఐఎంఎఫ్​ పేర్కొంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత్​ జీడీపీ వృద్ధి 5 శాతంగా మాత్రమే నమోదుకావడంపై ఐఎంఎఫ్​ ఆందోళన వ్యక్తం చేసింది. గత ఆరేళ్లలో ఇంత తక్కువ వృద్ధి నమోదు కావడం ఇదే ప్రథమమని గుర్తుచేసింది.

2019, 2020 రెండేళ్లకు గానూ భారత ఆర్థిక వృద్ధి అంచనాలను 0.3 శాతం తగ్గిస్తూ జులైలో నివేదిక విడుదల చేసింది ఐఎంఎఫ్​. ఈ నివేదిక ప్రకారం 2019లో 7 శాతం, 2020లో 7.2 శాతం వృద్ధి నమోదవుతుందని తెలిపింది.

మందగమనం ఉన్నప్పటికీ.. వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్​.. చైనా కన్నా ముందున్నట్లు ఐఎంఎఫ్ ప్రతినిధి గేరీ రైస్​ తెలిపారు.

ఇదీ చూడండి: 'అక్టోబరులో భారీగా తగ్గనున్న వడ్డీ రేట్లు!'

Last Updated : Sep 30, 2019, 11:57 AM IST

ABOUT THE AUTHOR

...view details