తెలంగాణ

telangana

ETV Bharat / business

రికార్డుస్థాయికి యాపిల్ ఆదాయం​- భారత్​లో భళా

లగ్జరీ స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థ యాపిల్.. 2020 డిసెంబర్​తో ముగిసిన త్రైమాసిక ఆదాయం 21 శాతం పెరిగి.. ఆల్​టైం రికార్డు స్థాయిని తాకినట్లు ప్రకటించింది. ఇదే సమయంలో భారత్​లో సంస్థ వ్యాపారాలు రెండింతలైనట్లు తెలిపింది. గత ఏడాది ఆన్​లైన్ స్టోర్​ ప్రారంభించడం, ఫోన్లపై భారీ ఆఫర్లు ప్రకటించడం ఇందుకు కలిసొచ్చినట్లు వెల్లడించింది.

By

Published : Jan 28, 2021, 2:00 PM IST

Apple India Business doubled
భారత్​లో యాపిల్ రెండింతలు వృద్ధి

ప్రముఖ టెక్​ దిగ్గజం యాపిల్ భారత వ్యాపారాలు భారీగా పుంజుకున్నట్లు ఆ సంస్థ సీఈఓ టిమ్​కుక్​ వెల్లడించారు. డిసెంబర్​తో ముగిసిన త్రైమాసికంలో తమ వ్యాపారాలు రెండింతలైనట్లు వివరించారు. 2020 సెప్టెంబర్ 23న సంస్థ ఆన్​లైన్​ స్టోర్​ను ప్రారంభించడం ఇందుకు కలిసొచ్చినట్లు తెలిపారు. భవిష్యత్​లో రిటైల్​ స్టోర్​ ప్రారంభించడం ద్వారా తమ వ్యాపారాలు మరింత పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రీమియం స్మార్ట్​ఫోన్ల విభాగంలో శాంసంగ్, వన్​ప్లస్​ వంటి సంస్థల నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్న యాపిల్​ విక్రయాలు 2020లో భారీగా పెరిగాయి. అయినప్పటికీ.. తమకున్న అవకాశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువేనని టిమ్​కుక్​ అభిప్రాయపడ్డారు. కంపెనీ త్రైమాసిక లభాల ప్రకటన సందర్భంగా ఈ వివరాలు వెల్లడించారు.

ఆదాయం ఆల్​టైం రికార్డ్..

2020 డిసెంబర్ 26తో ముగిసిన త్రైమాసిక ఆదాయం తొలిసారి 111.4 బిలియన్​ డాలర్లకు పెరిగినట్లు యాపిల్​ ప్రకటించింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 21 శాతం అధికమని తెలిపింది.

ఇందులో అంతర్జాతీయ విక్రయాల వాటా 64 శాతంగా ఉన్నట్లు వివరించింది.

ఇదీ చూడండి:'వినియోగదారులారా.. అప్​డేట్​ చేసుకోండి ప్లీజ్'​

ABOUT THE AUTHOR

...view details