తెలంగాణ

telangana

ETV Bharat / business

జీ గ్రూప్​ కార్యాలయాల్లో ఐటీ సోదాలు - జీ గ్రూప్​పై పన్ను ఎగవేత ఆరోపణలు

ఏడాది కాలంగా క్యాష్ ఫ్లో సమస్య ఎదుర్కొంటున్న మీడియా దిగ్గజం జీ గ్రూప్​ ముంబయి కార్యాలయంలో ఐటీ సోదాలు నిర్వహించింది. ఈ విషయాన్ని జీ గ్రూప్​ అధికారికంగా ధ్రువీకరించింది.

IT conducts searches at Zee Group offices
జీ గ్రూప్​పై ఐటీ దాడులు

By

Published : Jan 4, 2021, 4:58 PM IST

పన్ను ఎగవేత ఆరోపణలతో మీడియా దిగ్గజం జీ గ్రూప్​ ముంబయి కార్యాలయంలో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. ఈ విషయాన్ని జీ గ్రూప్​ కూడా ధ్రువీకరించింది.

ఐటీ అధికారులతో పూర్తిగా సహకరించినట్లు సంస్థ అధికార ప్రతినిధి వెల్లడించారు. వారికి కావాల్సిన అన్ని అధారాలను సమర్పించినట్లు వివరించారు. అయితే ముంబయి కార్యాలయంలో మాత్రమే సోదాలు నిర్వహించారా అనే విషయంపై స్పష్టతనివ్వలేదు.

ఐటీ అధికారుల ప్రకారం.. ముంబయితో పాటు దిల్లీలో ఉన్న జీ గ్రూప్ కార్యాలయంలోనూ సోదాలు చెపట్టినట్లు తెలుస్తోంది. సోదాల్లో తెలిసిన వివరాలు మాత్రం ఐటీ అధికారులు వెల్లడించలేదు.

ఇదీ చూడండి:ఈఎంఐ కట్టలేని స్థితికి 80% ఎంఎస్ఎంఈలు!

ABOUT THE AUTHOR

...view details