హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా షైన్ బైక్ ధరను పెంచింది. ప్రస్తుతం హోండా తయారు చేసే బైకుల్లో ఇదే అత్యధికంగా అమ్ముడుపోయే మోడల్. దీని ధర రూ.1,072 పెంచుతున్నట్లు ప్రకటించింది కంపెనీ.
ధరల పెంపుతో డ్రమ్ బ్రేక్ వేరియంట్ షైన్ ఎక్స్షోరూమ్ ధర రూ.71,550గా ఉండగా.. డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ.76,346గా ఉంది.
ఇప్పటికే ఈ బైకును ఎస్బీఐ క్రెడిట్ కార్డు వినియోగించి, ఈఎంఐలపై కొనుగోలు చేసే వారికి రూ.3,500 వరకు డిస్కౌంట్లను ప్రకటించిన విషయం తెలిసిందే.