భారత్లో కరోనాకు చెక్ పెట్టే లక్ష్యంతో రెమ్డెసివిర్ తయారీకి అనుమతి పొందిన ఫార్మా సంస్థ హెటిరో 'కొవిఫిర్' పేరుతో వైరస్ నిరోధక ఔషధాన్ని విడుదల చేసింది. ఈ మందును దేశవ్యాప్తంగా రూ. 5,400కు అమ్మనున్నట్లు చెప్పింది. ఇప్పటికే 20,000 డోసులను సిద్ధం చేసిన హెటిరో 10,000 డోసులను వైరస్తో తీవ్రంగా ప్రభావితమవుతున్న దిల్లీ, గుజరాత్, తమిళనాడు, హైదరాబాద్, ముంబయి సహా మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. మరో 10,000 డోసులను కోల్కతా, ఇండోర్, భోపాల్, లఖ్నవూ, పట్నా, భువనేశ్వర్, రాంచీ, విజయవాడ, కొచ్చిన్, త్రివేండ్రం, గోవాకు సరఫరా చేయనున్నట్లు స్పష్టం చేసింది.
"కొవిఫిర్ భారత్లో విడుదల కావడం ఒక మైలురాయిగా చెప్పవచ్చు. ఈ మందు తీసుకోవడం ద్వారా కరోనా చికిత్సా కాలం తగ్గుతుందని భావిస్తున్నాం. తద్వారా ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతుందని అనుకుంటున్నాం."
- శ్రీనివాస రెడ్డి, హెటిరో ఫార్మా ఎండీ