తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఎయిర్​ఇండియా వద్దు.. ఇండిగో అయితే ఓకే' - ఎయిర్​ఇండియాపై ఖతర్​ ఎయిర్​వేస్ అనాసక్తి

ప్రభుత్వ రంగ విమానాయన సంస్థ ఎయిర్​ఇండియాలో పెట్టుబడులు పెట్టే యోచన లేదని ఖతర్ ఎయిర్​వేస్ వెల్లడించింది. అయితే.. మరో ప్రైవేటు రంగ విమానయాన సంస్థ ఇండిగోలో పెట్టుబడిపై ఆసక్తి ఉన్నట్లు తెలిపింది.

'ఎయిర్​ఇండియా వద్దు.. ఇండిగో అయితే ఓకే'

By

Published : Nov 7, 2019, 4:27 PM IST

ఎయిర్ఇండియాలో వాటా కొనుగోలుపై ఆసక్తి లేదని ఖతర్ ​ఎయిర్​వేస్​ స్పష్టం చేసింది. ఈ మేరకు సంస్థ సీఈఓ అక్బర్​ అల్ బాకర్ అధికారిక ప్రకటన చేశారు.

ప్రభుత్వాధినంలోని ఎయిర్​ఇండియాలో పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం ఎయిర్​ ఇండియాలో వాటాలు కొనుగోలు చేయాలని సింగపూర్​, లండన్​లలో రోడ్​ షోలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో వాటా కొనుగోలుపై ఆసక్తిలేదని ఖతర్ ఎయిర్​వేస్​ స్పష్టం చేసింది. అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్​ ఇండియాను గట్టెక్కించేందుకు సంస్థలో వాటాను విక్రయించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే.

అయితే ఇండిగో సంస్థలో పెట్టుబడులకు మాత్రం ఆసక్తిగా ఉన్నట్లు ఖతర్ ఎయిర్​వేస్​ వెల్లడించింది. కానీ ఇండిగో ప్రమోటర్ల మధ్య వివాదం తలెత్తిన నేపథ్యంలో పెట్టడులకు ఇది సరైన సమయం కాదని భావిస్తున్నట్లు తెలిపింది.

దేశంలో ప్రస్తుతం 48 శాతం దేశీయ మార్కెట్​ వాటాతో ఇండిగో అగ్రస్థానంలో ఉంది. ఇటీవలే కొత్త విమానాలకు భారీ ఆర్డర్​ ఇచ్చింది ఇండిగో.

ఇదీ చూడండి: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 12 వేల మార్క్ దాటిన నిఫ్టీ

ABOUT THE AUTHOR

...view details