ప్రభుత్వ రంగ సంస్థ 'హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్)' ఆదాయంలో 6 శాతం వృద్ధి నమోదు చేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.19,400 కోట్ల ఆదాయం గడించింది. ఇది 2017-18లో 18,284 కోట్లుగా ఉంది.
"2018-19 ఆర్థిక సంవత్సరంలో సంస్థ పనితీరు మెరుగుపడింది. ఇది దేశీయంగా కొత్త డిజైన్లు, సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ప్రోత్సాహం అందిస్తుంది. "
-ఆర్.మాధవన్, హాల్ ప్రధాన మేనేజింగ్ డైరెక్టర్