భారత్లో కోటీశ్వరుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 2018-19 అసెస్మెంట్ సంవత్సరంలో రూ.కోటికి పైగా ఆదాయం ఉన్న వారి సంఖ్య 97,689కు చేరింది. ఈ విషయాన్ని ఆదాయపన్ను శాఖ వెల్లడించింది. గత ఏడాది ఇదే సమయంలో వీరి సంఖ్య 81,344 మాత్రమే ఉంది. ఏడాదిలో దాదాపు 20శాతం వృద్ధిని సాధించింది. వీరిలో 49,128 మంది వేతన జీవుల ఆదాయం రూ. కోటి దాటింది. అదే గత ఏడాది వీరి సంఖ్య 41,457 మాత్రమే.
ఇక హిందూ అవిభాజ్య కుటుంబాల్లో రూ.కోటికి పైగా ఆదాయం ఉన్నవి 1.67లక్షలు ఉన్నట్లు ఐటీశాఖ లెక్కలు చెబుతున్నాయి. గతేడాది ఈ సంఖ్య 1.33లక్షలకు పరిమితమైంది. ఏడాదిలో దాదాపు 19శాతం వృద్ధి కనిపించింది.