తెలంగాణ

telangana

వచ్చే నెలలోనే బీపీసీఎల్​ విక్రయానికి బిడ్ల అహ్వానం!

By

Published : Dec 20, 2019, 8:33 PM IST

ప్రభుత్వ రంగ సంస్థలు ఎయిర్​ఇండియా, బీపీసీఎల్​ల విక్రయానికి వచ్చే నెలలో తొలి దశ బిడ్లను ఆహ్వానించే అవకాశముంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసినట్లు సమాచారం.

BPCL
బీపీసీఎల్​

ఎయిర్​ఇండియా సహా భారత్​ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్​)​లలో పెట్టుబడుల విక్రయానికి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. రెండు సంస్థల విక్రయానికి వచ్చే నెలలో తొలి దశ ఆసక్తి వ్యక్తికరణ (ఈఓఐ) బిడ్లను ఆహ్వానించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

రెండు సంస్థల్లో ఎయిర్​ఇండియా రూ.58,000 కోట్లకు పైగా రుణాల్లో కూరుకుపోయింది. ప్రస్తుతం ఈ సంస్థ భారీ నష్టాలతో నడుస్తోంది.
వచ్చే నెలలో బిడ్లను ఆహ్వానించినా.. బీపీసీఎల్​ విక్రయానికి సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇలాంటి భారీ ఆస్తుల విక్రయంలో ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశముంది.

ఎయిర్​ఇండియా సహా బీపీసీఎల్​ల ప్రైవేటీకరణకు గత నెలలోనే కేంద్ర కేబినెట్​ ఆమెదముద్ర వేసింది. అసోంలోని నుమాలీగర్‌లో ఉన్న రిఫైనరీ మినహాయించి.. బీపీసీఎల్‌లో కేంద్ర ప్రభుత్వ వాటా 53.29 శాతంతో పాటు, యాజమాన్య హక్కులను కొనుగోలుదారులకు వదిలిపెట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

ఇదీ చూడండి:2 స్క్రీన్స్​తో ఎల్​జీ కొత్త ఫోన్​- ధర తెలిస్తే షాక్​

ABOUT THE AUTHOR

...view details