తెలంగాణ

telangana

By

Published : Jul 14, 2020, 6:35 PM IST

ETV Bharat / business

జియో​లో గూగుల్ రూ.30 వేల కోట్ల పెట్టుబడి!

రిలయన్స్​ జియో ప్లాట్​ఫామ్స్​లో మరో దిగ్గజ సంస్థ గూగుల్ పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇరు సంస్థలు చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. జియోలో మొత్తం రూ.30 వేల కోట్లు పెట్టుబడి పెట్టాలని గూగుల్ భావిస్తున్నట్లు సమాచారం.

google too invest in Jio
గూగుల్ జియో ఒప్పందం

ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోలోకి పెట్టుబడుల వరద కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఫేస్​బుక్​ సహా 12 సంస్థలు 13 దఫాల్లో జియోలో పెట్టుబడులు పెట్టాయి. 25 శాతానికిపైగా వాటాను ఆయా సంస్థలకు విక్రయించడం ద్వారా మొత్తం రూ.1,18,318.45 కోట్లు గడించింది జియో.

ఇప్పుడు మరో దిగ్గజ సంస్థ గూగుల్.. జియో ప్లాట్​ఫామ్స్​​లో 4 బిలియన్ డాలర్లు (రూ.30 వేల కోట్లకు పైమాటే) పెట్టుబడి పెట్టనున్నట్లు వార్తలొస్తున్నాయి. దీనికి సంబంధించి గూగుల్-జియో మధ్య చర్చలు చివరి దశకు చేరినట్లు ఈ వ్యవహారంతో సంబంధమున్న వ్యక్తులు తెలిపారు.

ఈ విషయంపై ఇరు సంస్థలు రానున్న వారాల్లో అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశముందని వారు వెల్లడించారు. అయితే దీనిపై గూగుల్, జియో స్పందించేందుకు నిరాకరించాయి.

ABOUT THE AUTHOR

...view details