తెలంగాణ

telangana

ETV Bharat / business

కిరాణా దుకాణాలతో జట్టుకట్టనున్న ఫ్లిప్​కార్ట్

వినియోగదారులకు మరింత చేరవయ్యేందుకు దేశవ్యాప్తంగా కిరాణా దుకాణాలతో జట్టుకట్టనుంది ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్​కార్ట్​. పండగ సీజన్ దృష్ట్యా సరుకుల సరఫరా మరింత వేగవంతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపింది.

By

Published : Sep 10, 2019, 6:12 AM IST

Updated : Sep 30, 2019, 2:11 AM IST

కిరాణా దుకాణాలతో జట్టుకట్టనున్న ఫ్లిప్​కార్ట్

దేశవ్యాప్తంగా 16కోట్ల మంది వినియోగదారులకు ఆన్​లైన్ ద్వారా వస్తు సరఫరా సేవలందిస్తున్న ఫ్లిప్​కార్ట్ సంస్థ.. కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు మరో ముందడుగు వేసింది. 700 నగరాల్లో, 27వేల కిరాణా దుకాణాల ద్వారా వస్తు సరఫరా సేవలను అందించనున్నట్లు ఫ్లిప్​కార్ట్ అధికారిక ప్రకటనలో తెలిపింది. వినూత్న కార్యచరణ ద్వారా ఈ-కామర్స్​లో సరికొత్త విప్లవం రానుందని సంస్థ సీఈఓ తెలిపారు.

వచ్చే పండగ సీజన్​, బిగ్ బిలియన్​ డేస్​ ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్లిప్​కార్ట్ తెలిపింది. ఈ నిర్ణయంతో కస్టమర్స్ కి మరింత చేరువ కావడమే కాక, కిరాణా దుకాణాల యజమానులు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు చేయూతనిస్తుందని పేర్కొంది.

ప్రతిరోజు 10లక్షల వస్తువులను కస్టమర్లకు సరఫరా చేస్తోంది ఫ్లిప్​కార్ట్​. దేశంలోని దాదాపు అన్ని పిన్ కోడ్ పరిధిలలో సేవలను అందిస్తోంది.

ఇదీ చూడండి:బంగారం ధర నేడు ఎంత తగ్గిందంటే...

Last Updated : Sep 30, 2019, 2:11 AM IST

ABOUT THE AUTHOR

...view details