తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫ్లిప్​కార్ట్, అమెజాన్​ సేవలు తాత్కాలికంగా బంద్​

లాక్​డౌన్​ కారణంగా తమ సేవలను తాత్కాలికంగా రద్దు చేస్తునట్లు ఫ్లిప్​కార్ట్, అమెజాన్​ ప్రకటించాయి. కరోనా వ్యాప్తిని నిలువరించే విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. ఫ్లిప్​కార్ట్ సేవలన్నింటినీ నిలిపేయగా.. అమెజాన్​ కొత్త ఆర్డర్లను రద్దు చేసింది.

By

Published : Mar 25, 2020, 9:56 PM IST

Flipkart
ఫ్లిప్​కార్ట్

భారత్​లో లాక్​డౌన్​ అమలులో ఉన్న నేపథ్యంలో సేవలను తాత్కాలికంగా నిలిపేశాయి ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్​కార్ట్​, అమెజాన్​. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రభుత్వం విధించిన నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి.

"కేంద్ర హోంశాఖ మార్చి 24న ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా మేం మా సేవలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నాం. వీలైనంత త్వరగా మా సేవలను పునరుద్ధరించి మీ ముందుకు వస్తాం."

- ఫ్లిప్​కార్ట్​

కొన్ని రోజులుగా ఈ-కామర్స్​ వేదికగా ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలను బయటికి రావద్దని ప్రభుత్వం ఆంక్షలు విధించిన కారణంగా ఎక్కువ మంది ఆన్​లైన్​లోనే ఆహారం, గృహోపకరణాలు భారీ ఎ్తతున కొనుగోలు చేస్తున్నారు. వర్క్​ ఫ్రమ్​ హోం కోసం రౌటర్లు, కేబుల్స్​ కూడా ఆన్​లైన్​లోనే ఆర్డర్ చేస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో అత్యవసరమైన వస్తువులపై దృష్టి సారించేందుకు సాధారణ వస్తువుల ఆర్డర్ల స్వీకరణను అమెజాన్​ నిలిపేసింది. ఈ పరిస్థితుల్లో ప్రధానమైన గృహ అవసరాలకు సంబంధించిన ఆర్డర్లను అందిస్తామని స్పష్టం చేసింది.

వీటికి అనుమతులు ఉన్నాయ్​..

భారత్​లో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశమంతా 21 రోజులపాటు లాక్​డౌన్ విధిస్తూ ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం ప్రకటన చేశారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ పలు మార్గదర్శకాలు విడుదల చేసింది.

నిత్యవసరాలైన ఆహారం, మందులు, వైద్య పరికరాలను ఈ- కామర్స్​ ద్వారా డెలివరీ చేసేందుకు అనుమతులు ఇచ్చింది కేంద్రం. అయినప్పటికీ డెలివరీ విషయంలో పలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సంస్థలు తెలిపాయి.

ఇదీ చూడండి:'మహాభారత యుద్ధం 18 రోజులు- కరోనాపై పోరు 21 రోజులు'

ABOUT THE AUTHOR

...view details