తెలంగాణ

telangana

ETV Bharat / business

స్థిరాస్తి రంగ వృద్ధిదారులకు పన్ను మినహాయింపు!

స్థిరాస్తి రంగంలో పెట్టుబడులను పెంచడం సహా ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించేందుకు నూతన ప్రోత్సాహకాలను తీసుకురానుంది ఆర్థిక మంత్రిత్వ శాఖ. ఇందులో భాగంగా స్థిరాస్తి రంగ డెవలపర్ల లాభాలపై పదేళ్ల పాటు పన్నులు మినహాయించాలని భావిస్తోంది.

By

Published : May 30, 2019, 3:13 PM IST

పన్ను మినహాయింపు

స్థిరాస్తి రంగం డెవలపర్ల లాభాలపై పదేళ్లపాటు పన్ను మినహాయింపు ఇవ్వాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ముఖ్యంగా స్థిరాస్తి రంగంలో పెట్టుబడులను పెంచడం, ఆర్థిక వృద్ధికి ఊతమందించేందుకు ఈ నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

ఇటీవల జరిగిన ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, రియల్​ ఎస్టేట్ డెవలపర్ల సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. ఇందులో ఈ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై సలహాలు ఇవ్వాల్సిందిగా మంత్రిత్వశాఖను కోరారు డెవలపర్లు. లాభాలపై పదేళ్లు పన్ను మినహాయింపులు కావాలని కూడా మంత్రిత్వ శాఖకు విన్నవించినట్లు సమాచారం.

ప్రోత్సాహం ఎందుకు?

కొన్నేళ్లుగా దేశ జీడిపీలో పెట్టుబడులు 36 శాతం నుంచి 29 శాతానికి తగ్గాయి. ఇందుకు రియల్టీ రంగంలో మందగమనమే ప్రధాన కారణమని ఆర్థిక మంత్రిత్వ శాఖ గుర్తించింది.

ఈ మేరకు పన్ను మినహాయింపు అంశంపై పరిశ్రమ వర్గాలతో మంతనాలు మొదలు పెట్టింది ఆర్థిక మంత్రిత్వ శాఖ. జూలైలో ప్రవేశపెట్టనున్న 2019-20 ఆర్థిక సంవత్సర పూర్తి బడ్జెట్​లో పన్ను మినహాయింపు అంశం చర్చకు రానుంది.

సుంకాల సడలింపు దిశగా...

ఇప్పటికే రియల్టీ రంగ డిమాండుల మేరకు సరసమైన ధరల్లో లభ్యమయ్యే ఇళ్లపై ఒక శాతం, ఇతర వాటికి 5 శాతం వరకు పన్నులు తగ్గించింది జీఎస్​టీ కౌన్సిల్​. ఇంతకు మందు ఈ సుంకాలు వరుసగా 8, 12 శాతాలుగా ఉన్నాయి.

నిధుల లభ్యతను పెంచండి

నిర్మాణ రంగానికి నిధుల కొరత పెద్ద సమస్యగా మారింది. ఇందుకు ప్రధాన కారణం బ్యాంకింగేతర ఆర్థిక రంగ సంక్షోభం. ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించి నిధుల కొరతను తీర్చాలని కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరారు డెవలపర్లు.

ABOUT THE AUTHOR

...view details