తెలంగాణ

telangana

By

Published : Oct 29, 2021, 4:40 PM IST

ETV Bharat / business

క్యూ2లో డాక్టర్ రెడ్డీస్​ లాభం రూ.992 కోట్లు

సెప్టెంబరు త్రైమాసికంలో డాక్టర్​ రెడ్డీస్​ రూ.992 కోట్ల లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసిక లాభంతో పోల్చితే ఇది దాదాపు 30శాతం ఎక్కువ.

Dr Reddy profits
క్టర్ రెడ్డీస్​ లాభం

ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్​ ల్యాబొరేటరీస్.. సెప్టెంబరు త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. రెండో త్రైమాసికంలో 30శాతం వృద్ధితో రూ.992 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.701.7 కోట్ల లాభాన్ని ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ.4,896.7 కోట్ల నుంచి రూ.5,763.2 కోట్లకు పెరిగింది.

ఈ త్రైమాసిక ఫలితాల ప్రకటనతో రెడ్డీస్ షేర్లు ఒక దశలో గరిష్ఠంగా రూ.4,857.70కు చేరాయి. చివరకు రూ.65.85(1.44శాతం) లాభంతో.. రూ 4,635.80వద్ద ముగిశాయి.

"వ్యాపారం వృద్ధి చెందడం ఆనందకరం. ప్రధాన వ్యాపారాలైన జెనరిక్స్, ఏపీఐల విభాగాల బలోపేతానికి కృషి చేస్తాం." అని రెడ్డీస్ లేబొరేటరీస్ మేనేజింగ్ డైరెక్టర్​ జీవీ ప్రసాద్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ఈపీఎఫ్​ఓ వడ్డీరేటుపై ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్​

ABOUT THE AUTHOR

...view details