తెలంగాణ

telangana

ETV Bharat / business

రెడ్డీస్​ ల్యాబ్స్​కు క్యూ3లో రూ. 570 కోట్ల నష్టం - రెడ్డీస్​ ల్యాబ్స్​కు క్యూ3లో రూ. 570 కోట్ల నష్టం

మూడో త్రైమాసికంలో సుమారు రూ.570 కోట్ల నష్టాల్ని ప్రకటించింది డాక్టర్​ రెడ్డీస్​ ల్యాబోరేటరీస్​ సంస్థ. ఏకీకృత ఆదాయం 14 శాతం వృద్ధితో రూ.4,384 కోట్లుగా ఉన్నట్లు పేర్కొంది.

Dr Reddy's Labs
రెడ్డీస్​ ల్యాబ్స్​కు క్యూ3లో రూ. 570 కోట్ల నష్టం

By

Published : Jan 27, 2020, 3:30 PM IST

Updated : Feb 28, 2020, 3:43 AM IST

ప్రముఖ ఫార్మా కంపెనీ డాక్టర్​ రెడ్డీస్​ ల్యాబోరేటరీస్​ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక(అక్టోబర్​-డిసెంబర్​) ఫలితాలు విడుదల చేసింది. క్యూ3లో సుమారు రూ.570 కోట్ల నష్టాల్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే సమయానికి ఆ సంస్థ సుమారు రూ.485 కోట్ల లాభాల్ని ఆర్జించింది.

క్యూ3లో ఏకీకృత ఆదాయం సుమారు 14 శాతం వృద్ధితో రూ.4,384 కోట్లకు పెరిగింది. గత ఏడాది రూ.3,850 కోట్లుగా ఉంది. క్యూ3 ఫలితాలపై పలు కీలక విషయాలు వెల్లడించారు సంస్థ కో-ఛైర్మన్​, ఎండీ జీవీ ప్రసాద్​.

"మూడో త్రైమాసికంలో మా సంస్థ అన్ని వ్యాపారాల్లో మంచి పనితీరును కనబరిచింది. ఈబీఐటీడీఏ అంచనాలను సాధించగలిగాం. కొన్ని ఉత్పత్తులపై ఇంపెయిర్​మెంట్​ ఛార్జీల కారణంగా లాభాలపై ప్రభావం పడింది. నాణ్యమైన వ్యవస్థ, నిర్వహణ సామర్థ్యాల మెరుగుదలలో తగిన పురోగతి సాధించాం."

- జీవీ ప్రసాద్​, ఎండీ, రెడ్డీస్​ ల్యాబ్స్​

ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికలో సంస్థలోని కొన్ని ఉత్పత్తులపై ఇంపెయిర్​మెట్​ ఛార్జీలు సుమారు రూ.1,320 కోట్లుగా ఉన్నట్లు సంస్థ పేర్కొంది.

ఇదీ చూడండి: ఎయిర్ ఇండియాలో 100శాతం వాటా విక్రయానికి ప్రకటన

Last Updated : Feb 28, 2020, 3:43 AM IST

ABOUT THE AUTHOR

...view details