పండుగలు వచ్చాయంటే ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్కార్ట్లు భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తాయి. అయితే ఈ ఆఫర్లతో తమ వ్యాపారం దెబ్బతింటుందని సంప్రదాయ వ్యాపారులు వాపోతున్నారు. పండుగల వేళ ప్రకటిస్తున్న భారీ డిస్కౌంట్లను నిషేధించాలని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) ప్రభుత్వాన్ని కోరింది. ఈ ఆఫర్లు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలకు పూర్తి విరుద్ధమనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి.
ఈ-కామర్స్ సంస్థలు 10 శాతం నుంచి 80 శాతం డిస్కౌంట్లు ప్రకటించడం వల్ల మార్కెట్లో వస్తువుల ధరల్లో తీవ్ర అంతరం ఏర్పడుతోందని కేంద్రానికి రాసిన లేఖలో సీఏఐటీ పేర్కొంది.