భారత్లో ఫైజర్ కొవిడ్ టీకా వినియోగానికి త్వరితగతిన అనుమతుల కోసం ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్, సీఈఓ ఆల్బర్ట్ బౌర్లా సోమవారం వెల్లడించారు. ఫైజర్-బయోఎన్టెక్ సంయుక్తంగా ఈ టీకాను అభివృద్ధి చేశాయి.
భారత్లో రోగనిరోధక శక్తి పెంపొందించే కార్యక్రమాలకుగానూ లాభా పేక్ష లేకుండా తమ టీకా విక్రయిస్తామని ఏప్రిల్ ఆరంభంలో ఫైజర్ ప్రకటించింది. ఇప్పటికీ ఆ వాగ్దానానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది.