తెలంగాణ

telangana

ఫోన్​ మాట్లాడండి... మీకే డబ్బులు వస్తాయ్​!

By

Published : Nov 2, 2019, 4:24 PM IST

Updated : Nov 2, 2019, 8:27 PM IST

టెలికాం దిగ్గజం జియోకు షాకిస్తూ.. బీఎస్​ఎన్​ఎల్​ సరికొత్త ఆఫర్​ను తీసుకువచ్చింది. ఇతర నెట్​వర్క్​లకు చేసే కాల్స్​కు నిమిషానికి 6పైసల చొప్పున జియో ఛార్జ్​ చేస్తుంటే.. బీఎస్​ఎన్​ఎల్​ మాత్రం తామే ఆరు పైసలు ఎదురిచ్చేందుకు సిద్ధమైంది.

బీఎస్​ఎన్​ఎల్ కొత్త ఆఫర్​

ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్​ఎల్​ సరికొత్త ఆఫర్​తో వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రణాళికలు వేస్తోంది. తమ యూజర్లు కాల్స్ మాట్లాడితే సంస్థ నుంచి 6 పైసలు ఇచ్చేందుకు సిద్ధమైంది.

ఐయూసీ ఛార్జీల పేరుతో.. ఇతర నెట్​వర్క్​లతో మాట్లాడేందుకు రిలయన్స్ జియో ఇటీవల నిమిషానికి 6 పైసల చొప్పున ఛార్జీ వసూలు చేస్తోంది. ఈ నేపథ్యంలో.. బీఎస్​ఎన్​ఎల్​ సరికొత్త ఆఫర్​ను తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది.

ఆఫర్​ వివరాలు ఇలా..

తమ యూజర్లు ఐదు నిమిషాలకు పైగా కాల్​ మాట్లాడితే వారికి ఆరు పైసల చొప్పున.. బీఎస్​ఎన్​ఎల్ క్యాష్​బ్యాక్ ఇవ్వనున్నట్లు సమాచారం.
వైర్​లైన్​, బ్రాడ్​ బాండ్​, ఎఫ్​టీటీహెచ్ వినియోగదారులు ఈ ఆఫర్​ను పొందొచ్చు.

బీఎస్ఎన్​ఎల్​ తీసుకువచ్చిన ఈ కొత్త ఆఫర్​ మంచి ఫలితాలు ఇస్తుందని టెలికాం నిపుణులు అంటున్నారు. వీటికి తోడు బీఎస్​ఎన్​ఎల్​ సహా ఎంటీఎన్​ఎల్​లను పరిరక్షించేందుకు ఇటీవల భారీ ప్యాకేజీని ప్రకటించింది కేంద్రం. ఈ ప్రణాళికలన్నీ బీఎస్​ఎన్​ఎల్​కు వినియోగదారులను పెంచే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి: ట్విట్టర్​ నుంచి వైదొలుగుతున్నా: ఎలాన్​ మస్క్

Last Updated : Nov 2, 2019, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details