తెలంగాణ

telangana

By

Published : Sep 13, 2019, 6:00 AM IST

Updated : Sep 30, 2019, 10:15 AM IST

ETV Bharat / business

విలీనానికి వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె !

పది ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు బ్యాంకులుగా విలీనం చేయాలన్న ప్రతిపాదనకు నిరసనగా పలు బ్యాంకింగ్​ సంఘాలు విధుల బహిష్కరణకు సిద్ధమయ్యాయి. ఈ నెల 26, 27 తేదీల్లో సమ్మె చేయనున్నట్లు నాలుగు ప్రధాన బ్యాంకింగ్​ సంస్థలు నోటీసులిచ్చాయి.

బ్యాంకు ఉద్యోగుల సమ్మె

ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి నిరసనగా నాలుగు బ్యాంకింగ్ సంఘాలు రెండు రోజులు విధులు బహిష్కరించనున్నట్టు ప్రకటించాయి. సెప్టెంబర్ 26 నుంచి 27 వరకు సమ్మె కొనసాగుతుందని బ్యాంకింగ్ సంఘాలు తెలిపాయి. ఈ మేరకు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ , ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్ సంఘాలు సమ్మె నోటీసులిచ్చాయి.

నోటీసుల్లో పేర్కొన్న డిమాండ్లు ఇవే..

  • బ్యాంకుల విలీనం ఉపసంహరణ
  • సత్వర వేతన సవరణ
  • వారానికి ఐదురోజుల పనిదినాల అమలు
  • విజిలెన్స్ కేసుల్లో బయటి సంస్థల జోక్యాన్ని నిలిపివేయడం
  • ఎన్​పీఎస్ స్థానంలో పాత పెన్షన్‌ విధానం అమలు
  • సేవా ఛార్జీలు తగ్గింపు

ఈ డిమాడ్లపై కేంద్రం స్పందించకపోతే నవంబర్ రెండవ వారం నుంచి దేశంలోని అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు నిరవధిక సమ్మెకు దిగుతాయని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి.

ఇదీ చూడండి: 'చిల్లర ధరల ఆధారిత ద్రవ్యోల్బణం' వృద్ధి

Last Updated : Sep 30, 2019, 10:15 AM IST

ABOUT THE AUTHOR

...view details