తెలంగాణ

telangana

ETV Bharat / business

విప్రో పగ్గాలు అజీం నుంచి రిషద్​ చేతికి! - అజీం ప్రేమ్​జీ

ఐటీ దిగ్గజ సంస్థ విప్రో ఎగ్జిక్యూటివ్​ ఛైర్మన్​ అజీం ప్రేమ్​జీ జులై 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన తనయుడు రిషద్​ ప్రేమ్​జీ ఆ బాధ్యతలు స్వీకరించనున్నారు.

విప్రో పగ్గాలు అజీం నుంచి రిషద్​ చేతికి!

By

Published : Jun 6, 2019, 5:05 PM IST

ఐటీ దిగ్గజం విప్రో ఎగ్జిక్యూటివ్​ ఛైర్మన్​ పదవి నుంచి త్వరలోనే వైదొలగనున్నారు అజీం ప్రేమ్​జీ. జులై 30న పదవీ విరమణ చేయనున్నట్లు సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అజీం ప్రేమ్​జీ తనయుడు, ప్రస్తుతం విప్రో ముఖ్య ప్రణాళికాధికారి(సీఎస్​ఓ), బోర్డు సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రిషద్​ ప్రేమ్​జీని ఆయన వారసుడిగా ప్రకటించింది.

''భారత సాంకేతిక రంగ మార్గనిర్దేశకుల్లో ఒకరు, విప్రో వ్యవస్థాపకులు అజీం ప్రేమ్​జీ ఎగ్జిక్యూటివ్​ ఛైర్మన్​గా పదవీ విరమణ చేయనున్నారు. 53 ఏళ్ల పాటు కంపెనీ బాధ్యతలు నిర్వర్తించిన ఆయన పదవీకాలం 2019 జులై 30న ముగియనుంది. అయితే.. నాన్​ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​, ఫౌండర్​ ఛైర్మన్​గా బోర్డులో కొనసాగనున్నారు.''

- విప్రో అధికారిక ప్రకటన

సంస్థ చీఫ్​ ఎగ్జిక్యూటివ్​, ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ అబిదలీ నీముఛ్​వాలా.. సీఈఓ, ఎండీగా తిరిగి నియమితులవుతారని తెలిపింది విప్రో. 2019 జులై 31 నుంచి వాటాదారులందరి ఆమోదంతో ఈ నిర్ణయాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:

రుణం మరింత తేలిక- 9 ఏళ్ల కనిష్ఠానికి వడ్డీరేట్లు

ABOUT THE AUTHOR

...view details