తెలంగాణ

telangana

ETV Bharat / business

పండుగ సీజన్​లో 'ఆటో' గేర్​ మారేనా...?

వాహనాలపై జీఎస్టీ తగ్గింపు ఉండదని స్పష్టమైన నేపథ్యంలో.. పరిశ్రమ వర్గాలకు సియామ్ కీలక సూచనలు చేసింది. వాహన తయారీ సంస్థలు స్వయంగా అమ్మకాలు పెంచుకునే మార్గాలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చింది. పండుగ సీజన్​లో వాహనాలకు డిమాండు పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

By

Published : Sep 21, 2019, 7:28 PM IST

Updated : Oct 1, 2019, 12:14 PM IST

సియామ్

ఆటోమొబైల్​ రంగ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పరిశ్రమ వర్గాలు సొంతంగానే పరిష్కారం కనుగొనాలని భారత వాహన తయారీదారుల సంఘం (సియామ్​) పిలుపునిచ్చింది. వాహనాలపై జీఎస్టీ తగ్గింపు ఉండదని తాజాగా స్పష్టమైన నేపథ్యంలో.. ఆటో మొబైల్​ సంస్థలు స్వయంగా డిమాండ్ పెంచుకునే ప్రణాళికలు రచించాలని సియామ్ సూచించింది.

గత కొన్నేళ్లలో ఎన్నడూ లేనంతగా వాహన రంగం సంక్షోభంలో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో అమ్మకాలను ప్రోత్సహించేందుకు జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని వాహన తయారీ సంస్థలు ప్రభుత్వానికి విన్నవించాయి.

"ఇటీవల జరిగిన 37వ జీఎస్టీ మండలి సమావేశంలో వాహనాలపై పన్ను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గుతుందని ఆటో మొబైల్​ రంగం భారీ ఆశలు పెట్టుకుంది. ఈ సమావేశం తర్వాత వాహనాలపై ఎలాంటి పన్ను తగ్గింపు ఉండదని స్పష్టమైంది." - రాజన్ వాద్రా, సియామ్ అధ్యక్షుడు

అయితే ప్రస్తుతం 60 శాతం ఆటోమొబైల్ విడిభాగాలు 18 శాతం జీఎస్టీ శ్లాబులో ఉండగా.. 40 శాతం మాత్రమే 28 శాతం శ్లాబు​లో ఉండటం గమనార్హం.
జీఎస్టీ తగ్గించనప్పటికీ.. పండుగ సీజన్ నేపథ్యంలో అమ్మకాల పెరుగుతాయని ఆశిస్తున్నట్లు వాద్రా తెలిపారు. సబ్ సెగ్మెంట్​లోని 10-13 సీటర్​ (నాలుగు మీటర్ల కన్న తక్కువ పొడవు) వాహనాలపై కాంపన్​సేషన్​ సెస్ తగ్గింపు ఇందుకు ప్రోత్సాహమందిస్తుందని ఆయన అంచనా వేశారు.

వృద్ధికి ఊతమందించే దిశగా ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన ఉద్దీపనలు పరిశ్రమ వర్గానికి మేలు చేస్తాయని వాద్రా అన్నారు. మార్కెట్​ స్థిరీకృతమై ఆదాయం సౌకర్యవంతమైన స్థాయికి చేరినప్పుడు.. ప్రభుత్వం వాహనాలపై జీఎస్టీ తగ్గిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: హౌడీ మోదీ: వాణిజ్య విభేదాలకు తెర పడేనా...?

Last Updated : Oct 1, 2019, 12:14 PM IST

ABOUT THE AUTHOR

...view details