ఐఫోన్, ఐప్యాడ్ వినియోగదారులు వారి డివైస్లను అప్డేట్ చేసుకోవాలని యాపిల్ సంస్థ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుత వెర్షన్లో హ్యాకర్ల మూలంగా భద్రతా పరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంది. ఇందుకు సంబంధించిన సాఫ్ట్వేర్ అప్గ్రేడ్లను వినియోగదారులకు మంగళవారం అందుబాటులోకి తెచ్చింది. ఈ సందర్భంగానే పై వ్యాఖ్యలు చేసింది.
'వినియోగదారులారా.. అప్డేట్ చేసుకోండి ప్లీజ్' - యాపిల్ ఐఫోన్ భద్రత
దిగ్గజ స్మార్ట్ఫోన్ సంస్థ యాపిల్ కీలక ప్రకటన చేసింది. వినియోగదారులు తక్షణం తమ డివైస్లను అప్డేట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. భద్రతా పరమైన సమస్యలు ఉండటమే కారణమని పేర్కొంది.

అప్డేట్ చేసుకోండి ప్లీజ్ : యాపిల్
ఈ సమస్యపై అనామక పరిశోధకులు తమను హెచ్చరించారని యాపిల్ వెల్లడించింది. యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్లో కీలక పాత్ర పోషించే 'కెర్నల్' సహా 'వెబ్కిట్' అనే వెబ్బ్రౌజర్ ఇంజిన్పైన భద్రతకు ముప్పు కలిగే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఏ రకంగా భద్రతకు ముప్పు ఉందో అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఈ అప్గ్రేడ్ ఐఫోన్ 6 మొదలు అన్ని రకాల యాపిల్ డివైస్ల్లో లభిస్తుంది.
ఇదీ చదవండి :2021 ప్రథమార్ధంలో 9.6 కోట్ల ఐఫోన్లు ఉత్పత్తి!