తెలంగాణ

telangana

​​​​​​​అమెజాన్ డెలివరీలకు..10 వేల ఎలక్ట్రిక్ వాహనాలు!

By

Published : Jan 20, 2020, 2:26 PM IST

Updated : Feb 17, 2020, 6:04 PM IST

ఎలక్ట్రిక్​ వాహనాలతో వస్తువుల డెలివరీకి ఈ కామర్స్ దిగ్గజాలు కసరత్తు ముమ్మరం చేస్తున్నాయి. 2025 నాటికి 10,000 ఎలక్ట్రిక్ వాహనాలను డెలివరీలకు వినియోగించనున్నట్లు అమెజాన్ ఇండియా ప్రకటించింది. ఫ్లిప్​కార్ట్ గత ఏడాదే ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించే అంశాన్ని వెల్లడించింది.

AMAZON
అమెజాన్

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్​ ఇండియా.. దేశం​లో ఎలక్ట్రిక్​ వాహనాల (ఈవీ) ద్వారా వస్తువులు డెలివరీ చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా 2025 నాటికి 10,000 ఎలక్ట్రిక్ వాహనాలను డెలివరీల కోసం వినియోగించనున్నట్లు సంస్థ ప్రకటించింది.

ఎలక్ట్రిక్ వాహనాలను 2019 నుంచి దేశంలోని పలు పట్టణాల్లో ప్రయోగాత్మకంగా వినియోగిస్తుండగా.. ఇప్పుడు విస్తరణకు సిద్ధమైనట్లు అమెజాన్ ఇండియా వెల్లడించింది. ఈ ఏడాది.. హైదరాబాద్, దిల్లీ (జాతీయ రాజధాని ప్రాంతం), బెంగళూరు, అహ్మదాబాద్​, పుణె, నాగ్​పుర్​,కోయంబత్తూర్​ సహా 20 పట్టణాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించనుంది అమెజాన్​. 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా లక్ష ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలన్న ప్రణాళికకు.. అదనంగా తాజా ప్రకటన చేసింది అమెజాన్.

ఫ్లిప్​కార్డ్​ది అదే బాట..

అమెజాన్​ ప్రత్యర్థి సంస్థ ఫ్లిప్​కార్ట్ 2020 మార్చి నాటికి తమ డెలివరీ వాహనాల్లో 40 శాతం వరకు ఎలక్ట్రిక్​ వాహనాలను సమకూర్చుకోనున్నట్లు గతేడాదే ప్రకటించింది. దిల్లీ, హైదరాబాద్​, బెంగళూరుల్లో ఇప్పటికే పలు ఎలక్ట్రిక్ వాహనాలను డెలివరీలకు వినియోగిస్తోందీ సంస్థ.

ఇదీ చూడండి:'సోషల్ మొబిలిటీ'లో భారత్​ ర్యాంకు @76

Last Updated : Feb 17, 2020, 6:04 PM IST

ABOUT THE AUTHOR

...view details