తెలంగాణ

telangana

By

Published : Apr 19, 2019, 8:31 AM IST

ETV Bharat / business

జెట్​కు ఎయిర్​ఇండియా చేయూత !

జెట్​ ఎయిర్​వేస్​కు చెందిన ఐదు విమానాలను లీజుకు తీసుకునేందుకు ఎయిర్​ఇండియా ప్రయత్నిస్తోంది. లండన్​, దుబాయి, సింగపూర్​లకు సర్వీసులను నడిపేందుకు 5 బోయింగ్​ 777 విమానాలను తీసుకోనున్నట్టు సమాచారం.

జెట్​కు ఎయిర్​ఇండియా చేయూత

జెట్​కు ఎయిర్​ఇండియా చేయూత

ఆర్థికంగా కుదేలయిన జెట్​ ఎయిర్​వేస్​కు చేయూతనిచ్చేందుకు ఎయిర్​ ఇండియా ప్రయత్నిస్తోంది. జెట్​కు చెందిన ఐదు బోయింగ్​ 777 విమానాలను లీజుకు తీసుకునే దిశగా ఆలోచిస్తున్నట్టు ఎస్బీఐ ఛైర్మన్​ రజనీష్ కుమార్​కు ఎయిర్​ ఇండియా ఛైర్మన్​ అశ్వని లోహని లేఖ రాశారు.

అన్ని రకాల విమాన సర్వీసులను జెట్​ సంస్థ నిలిపివేసింది. జెట్​ శ్రేణిలో భారీ విమానాలు చాలానే ఉన్నాయి. ఇందులో బోయింగ్​ 777-300 ఈఆర్​, ఎయిర్​బస్​ ఏ330 ఉన్నాయి. ఈ విమానాలను జెట్​ సంస్థ ఉపయోగించిన సర్వీసుల ప్రకారమే లండన్​, దుబాయి, సింగపూర్​కు వాడనున్నట్టు తెలుస్తోంది.

ప్రయాణికులకు ఊరట

జెట్​లో ముందస్తు బుకింగ్​ చేసుకున్న ప్రయాణికులకు తీపి కబురును అందించింది ఎయిర్​ ఇండియా. జెట్​ సర్వీసుల రద్దు కారణంగా ముందుగా బుకింగ్​ చేసుకున్న ప్రయాణికులు ఇబ్బందులు ఏర్పడ్డాయి. వీరిలో అంతర్జాతీయ ప్రయాణికులకు ప్రత్యేక ధరలను అందుబాటులోకి తెస్తామని ఎయిర్​ఇండియా ప్రకటించింది.

ఇతర సంస్థలకు సర్వీసులు

జెట్​ విమానాల రద్దుతో ప్రయాణికుల ఇబ్బందులు తగ్గించేందుకు భారత పౌర విమానయాన సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. దిల్లీ, ముంబయి విమానాశ్రయాల్లో 440 సర్వీసులను ఇతర సంస్థలకు అప్పగించనుంది.

ధరలు పెంచొద్దు

వేసవిలో విమానరంగానికి డిమాండ్​ సర్వసాధారణం. జెట్​ సర్వీసుల రద్దు నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. అయితే ధరలు పెరగకుండా చూడాలని విమానయాన సంస్థలను ప్రభుత్వం కోరింది. డిమాండ్​ పెరిగినా ధరలు అదుపు తప్పొద్దని ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చూడండి: జెట్ ఎయిర్​వేస్ పాక్షిక మూసివేత

ABOUT THE AUTHOR

...view details