తెలంగాణ

telangana

By

Published : Sep 9, 2019, 6:01 AM IST

Updated : Sep 29, 2019, 10:57 PM IST

ETV Bharat / business

మూడు నెలల్లో రూ.31 వేల కోట్ల బ్యాంకు మోసాలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2,480 బ్యాంకు మోసాల కేసులు నమోదైనట్లు ఆర్బీఐ వెల్లడించింది. వీటి విలువ రూ.31,898.63 కోట్లుగా పేర్కొంది. సమాచార హక్కు చట్టం కింద ఓ సామాజిక కార్యకర్త దరఖాస్తుకు సమాధానంగా ఈ విషయాలను వెల్లడించింది రిజర్వు బ్యాంకు.

ఆర్బీఐ

ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మోసాలు మాత్రం తగ్గడం లేదు. ఆర్బీఐఇటీవల వెల్లడించిన గణాంకాలే ఇందుకు నిదర్శనం.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 2,480 బ్యాంకు మోసాలు జరిగినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా బయటపడింది. ఈ మోసాల మొత్తం విలువ రూ.31,898.63 కోట్లుగా ఉన్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. మధ్యప్రదేశ్​కు చెందిన సామాజిక కార్యకర్త చంద్రశేఖర్​ గౌర్​ స.హ దరఖాస్తు​కు సమాధానంగా ఆర్బీఐ పలు కీలక విషయాలు వెల్లడించింది.

ఈ మోసాల్లో 38 శాతం.. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్​బీఐకి చెందినవని వెల్లడించింది ఆర్బీఐ. మోసాలకు సంబంధించి ఎస్​బీఐలో మొత్తం 1,197 కేసులు నమోదయ్యాయి. వీటి విలువ రూ.12,012.77 కోట్లు. ఎస్​బీఐ తర్వాతి స్థానంలో అలహాబాద్​ బ్యాంకు ఉంది. ఇందులో 381 కేసులు నమోదవగా.. వీటి విలువ రూ.2,855.46 కోట్లుగా ఉన్నట్లు ఆర్బీఐ పేర్కొంది.

బ్యాంకు మోసాలు,వాటి విలువను చెప్పినప్పటికీ.. అవి ఏ విధంగా జరిగాయో అనే అంశంపై ఆర్బీఐ స్పష్టత ఇవ్వలేదు. బ్యాంకులు, వాటి వినియోగదారులు ఎలాంటి నష్టాలు ఎదుర్కొంటున్నారో కూడా వెల్లడించలేదు ఆర్బీఐ.

మరిన్ని బ్యాంకు మోసాల వివరాలు..

బ్యాంకుమోసాలువిలువ
బరొడా బ్యాంకు 75 రూ.2,297,05 కోట్లు
ఓరియంటల్​ బ్యాంకు 45 రూ.2,133.08 కోట్లు
కెనరా బ్యాంకు 69 రూ.2,035.81 కోట్లు
సెంట్రల్ బ్యాంకు 194 రూ.1,982.27 కోట్లు
యునైటెడ్ బ్యాంకు 31 రూ.1,196.19 కోట్లు
కార్పొరేషన్ బ్యాంకు 16 రూ.960.80 కోట్లు
ఐఓబీ 46 రూ.934.67 కోట్లు
సిండికేట్ బ్యాంకు 54 రూ.795.75 కోట్లు
యూనియన్ బ్యాంకు 51 రూ.753.37 కోట్లు
బ్యాంక్ ఆఫ్ ఇండియా 42 రూ.517 కోట్లు
యూకో బ్యాంకు 34 రూ.470.74 కోట్లు
Last Updated : Sep 29, 2019, 10:57 PM IST

ABOUT THE AUTHOR

...view details