తెలంగాణ

telangana

By

Published : Mar 13, 2020, 7:10 AM IST

ETV Bharat / business

నిఫ్టీ బ్యాంక్​ ఇండెక్స్​ నుంచి ఎస్​ బ్యాంక్ షేర్లు​ ఔట్​

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ బ్యాంకింగ్​ ఇండెక్స్ నుంచి ఎస్​ బ్యాంకు షేర్లు బయటకు వెళ్లనున్నాయి. దాని స్థానంలో బంధన్​ బ్యాంకు షేర్లు బర్తీ కానున్నట్లు ఎన్ఎస్ఈ ఓ ప్రకటనలో తెలిపింది.

Yes Bank to be dropped from Nifty bank index from Mar 27
నిఫ్టీ బ్యాంక్​ ఇండెక్స్​ నుంచి ఎస్​ బ్యాంక్ షేర్లు​ ఔట్​

సంక్షోభంలో కూరుకుపోయిన ఎస్​ బ్యాంకుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీలోని బ్యాంకింగ్​ ఇండెక్స్​ నుంచి ఎస్​ బ్యాంకు షేర్లను తొలగిస్తున్నారు. మార్చి 27 నుంచి ఈ మార్పు అమలులోకి వస్తుందని..ఎస్​ బ్యాంక్​ స్థానాన్ని బంధన్​ బ్యాంకు భర్తీ చేయనుందని ఎన్​ఎస్​ఈ తెలిపింది.

ఎస్​ బ్యాంకు షేర్లలో ఫీచర్​ అండ్​ ఆప్షన్స్​ ఒప్పందం అందుబాటులో లేకపోవటమే ఇందుకు కారణమని ఎన్​ఎస్​ఈ​ ఓ ప్రకటనలో తెలిపింది. దాంతో పాటు మార్చి 29 నుంచి ఫీచర్స్​ అండ్​ ఆప్షన్ల విభాగం నుంచి బయటకు వెళ్లనుందని స్పష్టం చేసింది.

ఇవి కూడా...

బ్యాంకింగ్​ ఇండెక్స్​తో పాటు నిఫ్టీ ఆల్ఫా-50, నిఫ్టీ హై బీటా-50, నిఫ్టీ-500, నిఫ్టీ స్మాల్​ క్యాప్​-250, నిఫ్టీ మిడ్​స్మాల్​ క్యాప్​-400 ఇండెక్స్​లలోనూ మార్పులు చోటు చేసుకోనున్నాయి. మార్పులు చేసుకుంటున్న ఇండెక్స్​లలో కొత్త వాటిని చేర్చేందుకు ఓ కమిటీని నిర్వహిస్తోంది ఎన్​ఎస్​ఈ.

గాయత్రి ప్రాజెక్ట్స్​ కూడా నిప్టీ-500, నిఫ్టీ స్మాల్​క్యాప్​-250, నిప్టీ స్మాల్​ క్యాప్​-400 ఇండీసెస్​ నుంచి బయటకు వెళుతున్నట్లు ఎన్​ఎస్​ఈ ప్రకటించింది. దాని స్థానంలో శిల్పా మెడికేర్​ వస్తుందని తెలిపింది.

ఇదీ చదవండి:ఎస్​ బ్యాంకులో ఎస్​బీఐ పెట్టుబడి రూ.7,250 కోట్లు

ABOUT THE AUTHOR

...view details